HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Harish Rao Strongly Criticizes Congress Government

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని హరీశ్ రావు అన్నారు.

  • By Gopichand Published Date - 03:44 PM, Wed - 10 September 25
  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: తెలంగాణలో నెలకొన్న యూరియా కొరత, వరదలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు బదులుగా ‘బురద రాజకీయాలకు’ ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఆదివారం హడావుడిగా సభను నిర్వహించి, అసంపూర్తిగా ముగించడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అన్నారు.

రైతులకు పెనుశాపంగా మారిన పాలన

హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం లేవని, ఈ దిక్కుమాలిన పాలన తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందని అన్నారు. భారత దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ఎప్పుడూ లేవని, కాంగ్రెస్ చేతగాని పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం రోడ్ల వెంట బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆధార్ కార్డులు, పాస్‌బుక్కులు పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారని, పండుగలు, పబ్బాలు లేకుండా, వానా, ఎండతో సంబంధం లేకుండా రాత్రి, పగలు క్యూలో నిలబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలసి సొలసి పడిపోతున్నారని, ఓపిక లేక చెప్పులు, పాస్‌బుక్కులు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.

Also Read: Heavy Rains: 20 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!

పత్తి, వరికి యూరియా అత్యవసరం

పత్తి పూత దశలో, వరి పొట్ట దశలో ఉన్నాయని ఈ సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రావని రైతులు పడుతున్న ఆవేదన హృదయ విదారకంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, యూరియా సంక్షోభంపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే దీనికి సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ సంక్షోభం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వచ్చిందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ పాలనతో పోలిక

కేసీఆర్ పాలనలో సకాలంలో యూరియా సరఫరా జరిగిందని, పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం వల్ల ఏం లాభమని ఆయన నిలదీశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రం నుంచి తెప్పించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల నిర్లక్ష్యం

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని హరీశ్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం, అమెరికా పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం వల్ల ఆయిల్ ఫామ్, పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ఎంపీలకు ఉలుకు, పలుకు లేదని ఆయన దుయ్యబట్టారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • Congress Government
  • harish rao
  • telangana
  • telugu news
  • Urea

Related News

Dussehra

Dussehra: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌!

విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Onion Prices

    Onion Prices: ఉల్లి ధ‌ర‌లు ఢ‌మాల్.. కిలో ధ‌ర ఎంతంటే?

  • YS Sharmila

    YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!

  • amrapali ias

    IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!

  • Andhra Pradesh

    Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

Latest News

  • Black Spots: ముఖంపై నల్లటి మచ్చలు ఎందుకు వస్తాయి? కార‌ణాలివేనా?

  • RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?

  • Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!

  • Dasara Pooja : దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు..!

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

Trending News

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd