HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Do You Know The Fare Of Vande Bharat Express Train

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

  • Author : Gopi Date : 15-01-2023 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Vande Bharat Exp

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తాజాగా వందే భారత్ రైలులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణ ఛార్జీలు వెల్లడయ్యాయి. విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక్కరికి రూ. 1,720 (ఛైర్ కార్), రూ. 3,170 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి రూ. 905 (ఛైర్ కార్), రూ. 1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) ఇక సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రూ. 1365 (ఛైర్ కార్), రూ. 2485 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) (క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి) టికెట్ ధరలను నిర్ణయించారు.

ఈ ఛార్జీలను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన ఈ రైలును సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజులుగా ముందుగానే అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఈ రైలు నంబర్, ఆగే స్టేషన్లు, కాలపట్టిక వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం ఉదయం 10. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కేవలం 15వ తేదీ మాత్రమే ఈ స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 8. 45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

Also Read: Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2422 జాబ్స్

16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది.  విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు (20833) ప్రతి రోజూ ఉదయం 5. 45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2. 15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రైలు. రాత్రి 11. 30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇందులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • fare of Vande Bharat Express
  • secunderabad
  • telangana
  • Vande Bharat Express
  • vishakapatnam

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Shocking Incident In Macherla

    మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం

  • Amaravati

    శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

Latest News

  • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

  • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

  • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

  • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

  • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd