HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Deputy Cm Bhatti Vikramarka Indiramma Houses For All The Houseless

Deputy CM Bhatti Vikramarka: ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ..భట్టి విక్రమర్క

ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి సంక్షేమ పథకాలను అందించాం. ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం లెక్కలతో సహా త్వరలో ప్రజల ముందుంచుతాం. ఇల్లు ఇస్తామని బిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే మా లక్ష్యం.

  • By Kode Mohan Sai Published Date - 01:09 PM, Wed - 14 May 25
  • daily-hunt
Deputy Cm Bhatti Vikramarka
Deputy Cm Bhatti Vikramarka

రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికి వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గము ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కల తో సహా త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వదిలేసారు, 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారు. ఆదాయం లేకపోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖకు 11,600 కోట్లు ఖర్చు పెడుతున్నాము రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరింత నిధులు కేటాయిస్తాం అన్నారు.

ఇల్లు ఇస్తామని బిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వివరించారు. ప్రజా ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం అన్నారు. మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మిస్తున్నామని, ఇ 0దుకు 22,500 కోట్లు కేటాయించాం అన్నారు. అడవి హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరా గిరి జలవికాసం ద్వారా ఉచితంగా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్తు, పామ్ ఆయిల్, అవకాడో మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు.

ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు 21 వేల కోట్ల అందజేశాం అన్నారు.

రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వారందరికీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. గతంలో పెద్ద రోగం వస్తే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాం, ఆధారంగా కొత్త చికిత్సలను చేర్చాం రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా ఇది అన్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వందరోజుల పని కల్పిస్తున్నాం, అదే కుటుంబంలో పిల్లలు చదువుకునేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తాం అన్నారు. ఈ పాఠశాల నిర్మాణానికి 11,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలు చదువుకుంటే వారి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం అన్నారు.

90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నాం అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నాం అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నాం అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాని ప్రారంభించామని, జూన్ 2న సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరుతుందనీ డిప్యూటీ సీఎం అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Deputy CM Bhatti Vikramarka
  • Indiramma Indlu
  • telangana congress
  • Telangana Welfare Schemes

Related News

Azharuddin

Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు.. అవి ఇవే!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం (నవంబర్ 4, 2025) ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 16కు చేరింది.

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

Latest News

  • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

  • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

  • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

  • Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాల‌నుకునేవారికి అదిరిపోయే శుభ‌వార్త‌!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd