Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2024 - 4:36 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు భారత ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. రుణం పూర్తిగా చెల్లించే వరకు 2035-36 సంవత్సరం వరకు తెలంగాణలో ఎన్నికలలో పాల్గొనకుండా బీఆర్ఎస్ పార్టీపై అనర్హత వేటు వేయాలని ఆయన లేఖ పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే, రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఈసీకి తప్పక ఉంటుందని నేను గట్టిగా భావిస్తున్నాను అని హనుమంత రావు అన్నారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదికను ఉటంకిస్తూ ప్రాజెక్టు వ్యయాలు పెరుగుతున్నాయని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక ఒత్తిడిని ఎత్తి చూపుతూ, అవినీతి ఆరోపణలను ఎత్తిచూపారు. ప్రాథమికంగా రూ.1,41,544 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం రూ.2,52,048 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని కాగ్ నివేదిక పేర్కొంది.
Also Read: Hyderabad City Police: కుమారి ఆంటీని ఫాలో అయిన పోలీసులు