Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 11:39 AM, Mon - 22 April 24
Lok Sabha Polls 2024: రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ బాధ్యతలను సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
షెడ్యూల్ భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలైంది, మధ్యాహ్నం ఒంటి గంటలకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటలకు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో సీఎం ప్రసంగిస్తారు. ఇక రేపు నాగర్ కర్నూల్ ప్రచారం చేయనున్నారు. అంతేకాదు ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
లోకసభ ఎన్నికల్లో 15 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగానే వ్యూహంతో ముందుకెళ్తుంది. కాగా లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ , ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు కూడా పాల్గొంటారు.
Also Read: Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు
Tags
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.