Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. నాంపల్లిలో ఘటన
చార్మినార్ ఎక్స్ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
- By Gopichand Published Date - 09:44 AM, Wed - 10 January 24
Charminar Express: చార్మినార్ ఎక్స్ప్రెస్ (Charminar Express) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50మందికి గాయాలు కాగా.. కొందరికి గుండెపోటు సంభవించింది. ఫ్లాట్ ఫారమ్ సైడ్ వాల్ ను రైలు ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రైల్వే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలు అయినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్
పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్
చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాంపల్లి రైల్వే స్టేషన్లొ ప్రమాదం.
ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్ లని ఆసుపత్రికి తరలిస్తున్న రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు. pic.twitter.com/6derFcz7u9
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2024
ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పి.. 50 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను రైల్వే పోలీస్ సిబ్బంది, అధికారులు ఆస్పత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: IMD Weather: రానున్న 24 గంటల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు..!
రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో స్థానిక ప్రయాణీకులు భయంతో పరుగులు పెట్టారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఆగేందుకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా ఉంటే భారీ ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
TGO: డిమాండ్ల పై సీఎస్ శాంతి కుమారి ని కలసిన టీజీఓ సంఘం
TGO: పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్-సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి తెలంగాణ గజిటెడ్ ఆఫిసర్స్ అసోషియేషన్ నేడు అందచేసింది. పెండింగ్ లో ఉన్న డీఏ లను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాల డిమ�