Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
- By Praveen Aluthuru Published Date - 09:57 PM, Sun - 17 March 24
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ తీసుకుని స్పీకర్ ప్రసాద్ కుమార్ నివాసానికి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాత్రి 8 గంటల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవలేదని బీఆర్ఎస్ నేత ఆరోపించారు. ప్రసాద్ కుమార్ ఇంట్లో లేని కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద వేచి ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. అపాయింట్ మెంట్ తర్వాత కూడా స్పీకర్ తమను కలవకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే స్పీకర్ తనను కలవలేదని అన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని మరోసారి స్పీకర్కు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
Also Read; Credit Card : క్రెడిట్ కార్డ్ లిమిట్, బిల్ సైకిల్పై కొత్త రూల్స్.. తెలుసా ?
Tags
Related News
Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల దూకుడు
గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలు , నేతలు , అభ్యర్థులు శ్రమిస్తున్నారు.