HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Gurukula Bata Across Telangana From 30th Of This Month Ktr

Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్‌ గురుకుల బాట: కేటీఆర్‌

గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు.

  • Author : Latha Suma Date : 27-11-2024 - 6:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Phoned Sunil Rao
KTR Phoned Sunil Rao

Brs Gurukula Bata Program : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున “గురుకుల బాట” పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈనెల 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు “బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం” కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.

గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని ఎద్దేవా చేశారు. పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

మొదటి సంఘటన జరిగినప్పుడే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉంటే ఇంత మంది విద్యార్థుల ప్రాణాలు పోయి ఉండేవి కాదన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ ముఖ్యమంత్రికి ఆ పిల్లల తల్లితండ్రులు కడుపుకోత కనిపించటం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవటం, కీలకమైన విద్యాశాఖను ఆయన తన దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తుండటం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. పిల్లలకు సరైన అన్నం పెట్టటం, వారి బాగోగులు చూసుకోవటం కూడా చేతకాని దద్దమ్మ ప్రభుత్వమిదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరితే బీఆర్ఎస్‌ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రికి ఢిల్లీకి 28 సార్లు వెళ్లటానికి సమయం ఉంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయి లేదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు విద్యార్థులను పొట్ట పెట్టుకుంటున్న పాపపు పాలన అని మండిపడ్డారు. విద్యార్థుల చావులను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదవుకు దూరం చేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లైనా లేదా అని ప్రశ్నించారు.

Read Also: TDP MP Kalishetty: టీడీపీ ఎంపీ కలిశెట్టిని అభినందించిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్.. రీజ‌న్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brs Gurukula Bata Program
  • CM Revanth Reddy
  • food poisoning
  • Gurukula Vidyalayas
  • ktr
  • telangana

Related News

CM Revanth Leadership

రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది

  • KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

    నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

Latest News

  • రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్

  • ఊబకాయానికి చెక్ పెట్టే ‘మెటాబో లా’

  • శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో జపాన్‌ బ్యాంక్‌ రూ.39,168 కోట్లు పెట్టుబడి

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd