HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Amoy Kumar Land Grab Case Ed Reopens Probe

Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో ఎఫ్ఐఆర్…!

Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

  • By Kavya Krishna Published Date - 04:44 PM, Sun - 10 November 24
  • daily-hunt
Amoy Kumar
Amoy Kumar

Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ భూ కబ్జా కేసు మరోసారి మలుపు తీసుకుంటోంది. ఆయనపై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయిన అమోయ్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చే అవకాశాలు ఉన్నాయనీ తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈడీ అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద చర్యలు తీసుకునే సన్నాహాలు చేస్తున్నారు. ఈడీకి 12 ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో, స్థానిక పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ కేసుకు సంబంధించి, నాగారం భూదాన్ భూముల కేసును సివిల్ నేచర్ అనే పేరుతో గతంలో మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉన్న రికార్డులను స్థానిక పోలీసులు మళ్లీ పరిశీలిస్తున్నారు. సివిల్ నేచర్ పేరిట గతంలో విచారణ ముగిసిన కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలనీ, ఈడీ అధికారులు డీజీపీని అభ్యర్థించారు. ఇక, మహేశ్వరం పోలీసులు గతంలో క్లోజ్ చేసిన ఎఫ్ఐఆర్‌ను మళ్లీ సమీక్షించాలనీ, ఆ ద్వారా అమోయ్ కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపే నిర్ణయం తీసుకున్నారు.

ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో, 181 సర్వే నెంబర్ పరిధిలోని 43 ఎకరాల భూదాన్ భూములను అమోయ్ కుమార్ ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ జ్యోతి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. పలు రియల్టర్లు , ప్రజా ప్రతినిధులకు ఈ భూములు రిజిస్టర్ చేయడం, ఆ వ్యవహారంలో అధికారుల పాత్రను వివరించినది.

మాజీ తహసీల్దార్ జ్యోతి సహా పలువురు నిందితులపై గతేడాది ఆగస్టులో ఎఫ్ఐఆర్ క్లోజ్ అయినప్పటికీ, అమోయ్ కుమార్ పేరును ఈ కేసులో ప్రస్తావించలేదు. అయితే, ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలతో, ఇప్పుడు ఆ విషయంపై మరింత దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.

ఈ కేసు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములను తిరిగి సమీక్షిస్తూ, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులు నిర్ణయించారు.

Read Also : Maharashtra Elections : బీజేపీ మేనిఫెస్టో.. బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా చట్టం, నైపుణ్య జనాభా గణన, ఉచిత రేషన్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amoy Kumar
  • bribery
  • dgp
  • ED probe
  • IAS Officer
  • illegal land registration
  • Jyothi IAS
  • Land Acquisition
  • Land grab case
  • land scam
  • Law Enforcement
  • maheshwaram
  • Maheshwaram police
  • Nagaram Bhudan
  • PMLA
  • Rangareddy district
  • telangana
  • telangana elections 2024
  • telangana police

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd