HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Huge Land Scam Comes To Light In Adilabad

Land Scam: ఆదిలాబాద్‌లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి!

ఈ కేసులో మావల పోలీసులు తీవ్రంగా స్పందించారు. అరెస్టైన ముగ్గురు నిందితులపై IPC సెక్షన్లు 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు.

  • By Gopichand Published Date - 04:30 PM, Sun - 21 September 25
  • daily-hunt
Land Scam
Land Scam

Land Scam: ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసుకున్న ఒక పెద్ద కుంభకోణం (Land Scam) వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కూడిన ముఠా పట్టుబడింది. ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. మావల పోలీసులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు.

కుంభకోణం వివరాలు

సెప్టెంబర్ 20న మావల పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ కుంభకోణం బట్టబయలైంది. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నానం వెంకటరమణ, మావలకు చెందిన ఉష్క మల్ల రఘుపతి, రిమ్స్ ఆయుష్ విభాగం ప్రభుత్వ ఉద్యోగి బెజ్జవార్ సంజీవ్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సుమారు రూ. 2 కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్టర్ చేసుకుంది.

Also Read: IND vs PAK: మ‌రికాసేపట్లో భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. వాతావరణం ఎలా ఉంటుంది?

ఎలా జరిగింది?

బాధితుడు మిలింద్ కొర్తల్‌వార్ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మిలింద్‌కు చెందిన ప్లాట్లను ఈ ముఠా అక్రమంగా ఆక్రమించింది. ఈ ప్లాట్లకు సంబంధించిన అసలైన పత్రాలు బాధితుడి వద్ద ఉన్నప్పటికీ నిందితులు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా వాటిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మోసానికి సబ్‌ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్‌కు రూ. 7 లక్షలు లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సబ్ రిజిస్ట్రార్ అశోక్ పరారీలో ఉన్నాడు.

పోలీసుల చర్యలు

ఈ కేసులో మావల పోలీసులు తీవ్రంగా స్పందించారు. అరెస్టైన ముగ్గురు నిందితులపై IPC సెక్షన్లు 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్‌పైనా కేసు నమోదు చేశామని, త్వరలో అతడిని పట్టుకుంటామని మావల సీఐ కర్ర స్వామి మీడియాకు వెల్లడించారు. ఈ భూకుంభకోణంలో మరికొందరు ఉన్నారా అనే దానిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆదిలాబాద్‌లో భూ రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adilabad
  • land scam
  • police case
  • telangana
  • telugu news

Related News

Prime Minister Modi

Prime Minister Modi: రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన!

మోదీ పర్యటన కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెప్పడం కూడా. ఈ రెండు రాష్ట్రాల ప్రజలతో ఆయన మమేకమై, వారి సమస్యలను ఆలకించి, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని భావిస్తున్నారు.

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Bathukamma 2025

    Bathukamma 2025 : నేటి నుండి బతుకమ్మ మొదలు

  • Rain Alert

    Rain Alert : ఈరోజు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు

  • Kadiyam Srihari

    Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Latest News

  • Mahindra: మహీంద్రా కార్ల ధరలు తగ్గింపు.. ఎక్స్‌యూవీ 3XOపై భారీ ఆఫర్లు!

  • Aadhaar Card: ఆధార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక‌పై ఫ్రీగానే!

  • Land Scam: ఆదిలాబాద్‌లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి!

  • Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి? ఏ పూల‌తో త‌యారుచేస్తారు??

  • Heart: గుండెకు గండిపెట్టే రోజువారీ అలవాట్లు – నిపుణుల హెచ్చరిక

Trending News

    • EPFO 3.0: దీపావ‌ళికి ముందే శుభ‌వార్త‌.. పీఎఫ్ ఉపసంహరణ ఇక సులభతరం!

    • Mirai Collections: ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత అదే రికార్డ్ తేజ సజ్జా ఖాతాలో! ‘మిరాయ్’ కలెక్షన్ల హవా

    • PM Modi: ఈరోజు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోదీ..!

    • TTD Case: టీటిడీ పరకామణి కేసులో కీలక విష‌యాలు వెలుగులోకి

    • Navaratri Fasting: నవరాత్రి 2025 ఉపవాస నియమాలు: పాటించాల్సిన దినచర్యలు, జాగ్రత్తలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd