Hyderabad: హైదరాబాద్ కి 332 కి.మీ రీజినల్ రింగ్: కేటీఆర్
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 03:42 PM, Tue - 14 November 23
Hyderabad: హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని మళ్ళీ అధికారంలోకి రాగానే పూర్తి సినిమా చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. ఐదు కేంద్రీకృత రింగ్ రోడ్లు కలిగిన బీజింగ్ వంటి గ్లోబల్ సిటీలుగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని అన్నారు. 20 పట్టణాలను జాతీయ రహదారులతో కలుపుతూ జనాభాలో 40 శాతం మందిని కవర్ చేసే రీజనల్ రింగ్ రోడ్ త్వరలో ముందుకు తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో బిల్డర్లపై ప్రత్యేక పన్ను విధిస్తుందని ఎద్దేవా చేశారు. భవనాల అనుమతులను క్రమబద్ధీకరించే లక్ష్యంతో TS-Bpass వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్పై దృష్టి కేవలం మౌలిక సదుపాయాలపైనే కాకుండా ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతిపైనే ఉందన్నారు. చాలా కాలంగా భారతదేశ ఐటీ హబ్గా పరిగణించబడుతున్న బెంగళూరు నగరాన్ని కూడా అధిగమించి, ఐటీలో తెలంగాణ సాధించిన వృద్ధి గురించి కేటీఆర్ మాట్లాడుతూ, గత ఏడాది దేశంలో 4.50 లక్షల ఐటీ ఉద్యోగాలు నెలకొల్పితే హైదరాబాద్లో 1.50 లక్షలు మరియు బెంగళూరులో 1.46 లక్షల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పారు.
కాంగ్రెస్ గత తొమ్మిదళ్ల పాలనలో బీఆర్ఎస్ పనిచేసినట్లుగా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు కేటీఆర్. మరోవైపు తెలంగాణ రైతులను అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్సేనని అన్నారు. 2014కు ముందు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు వ్యవసాయం చేసేందుకు సరైన సౌకర్యాలు లేక అప్పులపాలయ్యారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెరిగింది. దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు.
Also Read: Thummala : తుమ్మల సంచలన కామెంట్స్..నేను గెలిస్తే ఏపీలో బాబు గెలిచినట్లే..
Tags
Related News
Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు.