Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయాలని యోచిస్తోంది.
- By Gopichand Published Date - 06:42 AM, Fri - 17 November 23
Amit Shah: ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయాలని యోచిస్తోంది. నవంబర్ 17న నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా అమిత్ షా ప్రసంగించనున్నారు. పర్యటన ప్రారంభించే ముందు సోమాజిగూడలోని పార్టీ మీడియా సెంటర్లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
నవంబరు 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతి (బీసీ) నేతను ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో అమిత్ షా ప్రకటించారు. అక్టోబర్ 27న సూర్యాపేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25 నుంచి 27 వరకు వరుసగా మూడు రోజుల పాటు మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. నవంబర్ 25న కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో, మరుసటి రోజు నిర్మల్లో జరిగే మరో సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Also Read: CM KCR Public Meeting : సీఎం కేసీఆర్ ప్రచార సభలో బుల్లెట్లు కలకలం
అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11: 30గం.కు బేగంపేటలోని ఐటీసీ కాకతీయకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10: 30గం.కు కత్రియా హోటల్కు వెళ్తారు. తరువాత బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసి.. అనంతరం బేగంపేట నుంచి గద్వాల్ వెళ్లి.. మ.12.45 నుంచి 1.20 వరకు గద్వాల్ సభలో పాల్గొంటారు. వివిధ జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత అక్కడి నుంచి అమిత్ షా నేరుగా అహ్మదాబాద్కు వెళ్తారు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Congress ‘Special Manifesto’ : తెలంగాణ కోసం భారీ హామీలు ప్రకటించిన కాంగ్రెస్
గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు