Telugu Latest News
-
#India
Cyclone Asna: దూసుకొస్తున్న తుపాను అస్నా, 1976లో తొలి తుఫాను
దూసుకొస్తున్న తుపాను అస్నా,1976 తర్వాత ఆగస్టులో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని వాతావరణ శాఖ తెలిపింది. 1976లో ఒడిశా మీదుగా ఏర్పడిన తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అరేబియా సముద్రంలో ఉద్భవించి, లూపింగ్ ట్రాక్గా మారి ఒమన్ తీరానికి సమీపంలో వాయువ్య అరేబియా సముద్రం మీదుగా బలహీనపడిందని పేర్కొంది
Published Date - 09:09 AM, Fri - 30 August 24 -
#India
President On Doctor Rape: కోల్కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
Published Date - 03:35 PM, Wed - 28 August 24 -
#India
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ: పీకే సంచలన నిర్ణయం
బీహార్లోని గయా జిల్లాలోని బేలా గంజ్ మరియు ఇమామ్ గంజ్ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జాన్ సూరాజ్ పోటీ చేసే అవకాశం ఉందని గత వారం ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు
Published Date - 06:29 PM, Sun - 25 August 24 -
#Telangana
CM Revanth On Hydraa: హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని అన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై ఆయన స్పందించారు. నగరంలో సరస్సులను ఆక్రమణకు గురైన వారి నుండి విడిపించడానికి మేము నిశ్చయించుకున్నాము అని రేవంత్ చెప్పారు
Published Date - 05:58 PM, Sun - 25 August 24 -
#Sports
Shikhar Dhawans Retirement: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై రోహిత్, విరాట్ స్పందన
2022 డిసెంబర్ 10న భారత్ తరఫున ధావన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు. పునరాగమనం చేసేందుకు ప్రయత్నించినా కుర్రాళ్ళ ఎంట్రీతో అది సాధ్యపడలేదు. చివరకు 38 ఏళ్ల వయసులో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ధావన్ రిటైర్మెంట్ ప్రకటనపై కోహ్లీ, రోహిత్ సోషల్ మీడియా సైట్ ఎక్స్ ద్వారా అతని సేవలకు గానూ కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 03:15 PM, Sun - 25 August 24 -
#India
PM Modi: ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్, పోలాండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలు కలిశారు. మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్తో నాలుగు ఒప్పందాలు కుదిరాయి. గత 45 ఏళ్లలో పోలాండ్కు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
Published Date - 02:49 PM, Sat - 24 August 24 -
#Speed News
SC Sub Classification: ఎస్సీ-ఎస్టీ వర్గీకరణ చట్టబద్దతపై గళం విప్పిన కటుకూరి శేఖర్
ఒక్క కులానికే న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో 61 ఎస్సీ ఉపకులాలు, 32 ఎస్టీ ఉపకులాలు ఉన్న అన్ని ఉపకులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎస్టీ-ఎస్సీల వర్గీకరణ అమలు చేసింది. అయితే నేటికీ 18 రోజులు గడుస్తున్నా కాలయాపన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయకపోవడం
Published Date - 02:19 PM, Mon - 19 August 24 -
#Speed News
Telangana: రూ.1790 కోసం ఆత్మహత్య, ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణలో ఔట్సోర్సింగ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.1790 కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Published Date - 07:08 PM, Sun - 18 August 24 -
#Andhra Pradesh
Anna Canteen: నెల్లూరులో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి నారాయణ
నెల్లూరులోని చేపల మార్కెట్లో కొత్త అన్న క్యాంటీన్ను ప్రారంభించారు ఏపీ మంత్రి నారాయణ. అంతకుముందు నిన్న గురువారం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడ మున్సిపల్ పార్కులో అన్న క్యాంటీన్'ను ప్రారంభించారు. తాడేపల్లి మండలం నులకపేటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్.
Published Date - 11:34 AM, Fri - 16 August 24 -
#Telangana
Telangana: సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్
ట్రాన్స్కో, జెన్కో, ఎస్పిడిసిఎల్ మరియు ఎన్పిడిసిఎల్తో సహా అనేక రాష్ట్ర యుటిలిటీలకు చెందిన ఉద్యోగులు రెండేళ్లుగా తమ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్ చేస్తున్నారు.
Published Date - 03:09 PM, Wed - 14 August 24 -
#Telangana
Hyderabad: వచ్చే నెలలో పూర్తి కానున్న ఆర్ఆర్ఆర్ భూసేకరణ
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని శాంతికుమారి అన్నారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంపై దృష్టి సారించాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని
Published Date - 10:56 PM, Tue - 13 August 24 -
#World
Sheikh Hasina First Statement: నా తండ్రిని అవమానించారు, షేక్ హసీనా తొలి ప్రకటన
గత జులై నుంచి ఇప్పటి వరకు ఉద్యమం పేరుతో విధ్వంసాలు, దహనకాండలు, హింసాత్మక ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హసీనా అన్నారు. నా తండ్రిని అవమానించారు అంటూ ఆవేదన చెందారు. దేశం కోసం నా కుటుంబ ప్రాణాలు అర్పించింది అని ఆమె గుర్తు చేసుకున్నారు. అల్లర్ల ముసుగులో హత్యలకు పాల్పడిన దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
Published Date - 10:38 PM, Tue - 13 August 24 -
#India
Himachal Pradesh: ఊపందుకున్న HIV కేసులు, ఎక్కడో తెలుసా?
హిమాచల్ ప్రదేశ్లో హెచ్ఐవి కేసులు విపరీతంగా పెరిగాయి. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి ప్రకారం కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 1,562 మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు, హమీర్పూర్ జిల్లాలో 1,037 మంది, మండి జిల్లాలో 738 మంది మరియు ఉనా జిల్లాలో 636 మంది ఉన్నారు. ఇది కాకుండా సిమ్లాలో 306 మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు
Published Date - 07:06 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Visakhapatnam: ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
పాండురంగాపురం మత్య్య దర్సిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై అధికారులు పరిస్థితిని అంచనా
Published Date - 01:59 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: మాజీ సీఎం ఎన్టీఆర్ ఆశయం, ఆగస్టు 15 నుంచి ప్రజల వద్దకు పాలన
1982లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు, వాటికి పరిష్కారాలను కనుగొనడానికి దార్శనికత కలిగిన మాజీ సీఎం ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలనను ప్రవేశపెట్టారు. తర్వాత సీఎం చంద్రబాబు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
Published Date - 09:48 AM, Mon - 12 August 24