President On Doctor Rape: కోల్కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:35 PM, Wed - 28 August 24

President On Doctor Rape: కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసుపై దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మౌనం వీడారు. ఈ రోజు ఆమె డాక్టర్ పై జరిగిన అఘాయిత్యంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన బాధను వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై విచారం వ్యక్తం చేసిన ముర్ము, కోల్కతాలో ఒక వైపు విద్యార్థులు, వైద్యులు మరియు పౌరులు నిరసనలు తెలుపుతున్నారని, మరోవైపు నేరస్థులు ఇతర ప్రదేశాలలో తిరుగుతున్నారని అన్నారు.కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. సమాజానికి ‘నిజాయితీ, నిష్పాక్షికమైన ఆత్మపరిశీలన’ అవసరమని ఆమె నొక్కి చెప్పారు.
కోల్కతా ఘటనపై రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు. నేడు బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్పై సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ను అప్రతిష్టపాలు చేయడమే ఈ బంద్ ఉద్దేశమని, ఆర్జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం-హత్య కేసు దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని మమత అన్నారు. కోల్కతాలో ఏర్పాటు చేసిన టీఎంసీ విద్యార్థి సంఘం ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటే డాక్టర్ హత్యకేసులో నిందితులకు 7 రోజుల్లో మరణశిక్ష విధించి ఉండేవారన్నారు. చనిపోయిన వైద్యురాలు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఉద్యమం చేపడతామని మమత తెలిపారు.
వారం రోజుల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలిచి 10 రోజుల్లోగా రేపిస్టులకు మరణశిక్ష విధించేలా బిల్లును ఆమోదిస్తామని మమత ప్రకటించారు. ఈ బిల్లును గవర్నర్కు పంపుతాం. ఆయన ఆమోదించకుంటే రాజ్భవన్ బయట నిరసనలు చేపడతాం. ఈ బిల్లు తప్పనిసరిగా ఆమోదించబడాలని ఆమె అన్నారు. దేశంలో అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా కఠిన చట్టాన్ని రూపొందించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మమత గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Also Read: 10 Years of PMJDY: నాలుగేళ్ల పనిని ఐదు నెలల్లో ఎలా పూర్తి చేశారో చెప్పిన నీతి ఆయోగ్