Telangana: రూ.1790 కోసం ఆత్మహత్య, ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణలో ఔట్సోర్సింగ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.1790 కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- By Praveen Aluthuru Published Date - 07:08 PM, Sun - 18 August 24

Telangana: మూడు నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపానికి గురై సూర్యాపేట జిల్లాలో ఔట్సోర్సింగ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వసీం తన సూసైడ్ నోట్లో తన కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. తన భార్య రజనీని ఉద్దేశించి కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు క్షమాపణలు చెప్పాడు.
వసీం కొందరికి రూ.1,790 రుణాలు చెల్లించాల్సి ఉంది. పైగా జీతం రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వసీం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తాను చెనిపోతూ కూడా ఇవ్వాల్సిన వారికి చెల్లించాలని మృతుడు తన భార్యను కోరాడు. తన స్నేహితులను ఉద్దేశించి ఒక ప్రత్యేక నోట్లో, వసీం గత మూడు నెలలుగా జీతం చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నానని, ఎవరూ ఇలాంటి పరిస్థితికి రాకూడదని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే జీతాలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. వసీం ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను, ఘోర వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుందన్నారు. అతని ప్రాణనష్టానికి బాధ్యులెవరని ప్రశ్నించారు కేటీఆర్.
Also Read: Educate Your Son: కూతుర్ని కాపాడు, కానీ కొడుకుకు మంచి నేర్పు: సూర్య కుమార్ యాదవ్