Sheikh Hasina First Statement: నా తండ్రిని అవమానించారు, షేక్ హసీనా తొలి ప్రకటన
గత జులై నుంచి ఇప్పటి వరకు ఉద్యమం పేరుతో విధ్వంసాలు, దహనకాండలు, హింసాత్మక ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హసీనా అన్నారు. నా తండ్రిని అవమానించారు అంటూ ఆవేదన చెందారు. దేశం కోసం నా కుటుంబ ప్రాణాలు అర్పించింది అని ఆమె గుర్తు చేసుకున్నారు. అల్లర్ల ముసుగులో హత్యలకు పాల్పడిన దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 10:38 PM, Tue - 13 August 24

Sheikh Hasina First Statement: బంగ్లాదేశ్ను విడిచిపెట్టిన 9 రోజుల తర్వాత తొలిసారిగా మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. షేక్ హసీనా కుమారుడు సజీబ్ జావేద్ తన తల్లి ప్రకటనను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని పూర్తి గౌరవంగా పాటించాలని బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు.
గత జులై నుంచి ఇప్పటి వరకు ఉద్యమం పేరుతో విధ్వంసాలు, దహనకాండలు, హింసాత్మక ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హసీనా అన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. నాలాగే ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన బాధతో జీవిస్తున్న వారి పట్ల నా సానుభూతి. ఈ హత్యలు, విధ్వంసాలకు పాల్పడిన వ్యక్తులపై సరైన విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆమె చెప్పారు. ఎవరి నాయకత్వంలో మనం స్వతంత్ర దేశంగా జీవించామో అతను షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ను ఘోరంగా అవమానించారని విచారం వ్యక్తం చేశారు హసీనా. ఈ నేపథ్యంలో దేశప్రజల నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.
প্রিয় দেশবাসী
আসসালামুয়ালাইকুম
ভাই ও বোনেরা, ১৯৭৫ সালে ১৫ই আগস্ট বাংলাদেশের রাষ্ট্রপতি জাতির পিতা বঙ্গবন্ধু শেখ মুজিবুর রহমানকে নির্মমভাবে হত্যা করে। তাঁর প্রতি গভীর শ্রদ্ধা জানাই। একই সাথে আমার মা বেগম ফজিলাতুন্নেসা, আমার তিন ভাই মুক্তিযোদ্ধা ক্যাপ্টেন শেখ কামাল,…— Sajeeb Wazed (@sajeebwazed) August 13, 2024
15 ఆగస్టు 1975న బంగ్లాదేశ్ అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆయన పట్ల నాకు లోతైన గౌరవం ఉంది. అదే సమయంలో మా అమ్మ బేగం ఫజిలతున్నెస్సా, నా ముగ్గురు సోదరులను దారుణంగా హత్య చేశారు. నేటికీ 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఇలా ఎందరో తన కుటుంబం నుంచి పలువురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఆగస్టు 15న అమరులైన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని, అమరవీరులకు నివాళులు అర్పించారు ఆమె.
దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ..ప్రియమైన దేశప్రజలారా ఆగస్ట్ 15, 1975న ధన్మొండి బంగాబంధు భవన్లో జరిగిన దారుణ హత్యలను స్మరించుకునే ఇంటిని బెంగాల్ ప్రజలకు అంకితం చేశాము. స్మారక మ్యూజియం నిర్మించబడింది. ఈ సభకు దేశంలోని సామాన్య ప్రజల నుంచి భారతదేశం, విదేశాల నుంచి ప్రముఖుల వరకు తరలివచ్చారు. ఈ మ్యూజియం స్వాతంత్ర్య స్మారక చిహ్నం. మా బతుకుకు ఆధారమైన జ్ఞాపకం బూడిదలో పోసిన పన్నీరు కావడం చాలా బాధాకరం. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారు. బంగబంధు భవన్లో పుష్పాలు సమర్పించి, ప్రార్థిస్తూ ఆత్మలందరికీ మోక్షం కలగాలని ప్రార్థించండి. బంగ్లాదేశ్ ప్రజలను అల్లా ఆశీర్వదిస్తాడు. జాయ్ బంగ్లా జాయ్ బంగాబంధు అంటూ ఆమె ముగించారు.
Also Read: Telangana Employees : తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపి సర్కార్