HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Telangana Farmers

తెలంగాణ రైతులకు శుభవార్త..

  • Author : Vamsi Chowdary Korata Date : 29-01-2026 - 3:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Farmers
Telangana Farmers

Telangana Farmers  తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా రైతులకు నెలకు రూ. 5,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. మార్చిలో నిధులు అందగానే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.

తెలంగాణలోని గిరిజన రైతుల సాగు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఇందిర సౌర గిరి జల వికాసం’’ పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం కోసం జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) నుంచి రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే నాబార్డ్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

తొలి దశలో 10 వేల మందికి లబ్ధి..

ప్రభుత్వ గ్యారెంటీతో మొదటి విడతలో రూ. 600 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే మార్చి నెల నాటికి ఈ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం మరో రూ. 600 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. పథకం అమలు మరింత వేగవంతం కానుంది. నిధులు అందిన వెంటనే అన్ని జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ పథకం కింద అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రైతుకు దాదాపు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. వ్యవసాయ అవసరాల కోసం వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను విద్యుత్ గ్రిడ్‌కు విక్రయించే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా రైతులకు నెలకు రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు అదనపు ఆదాయం లభించనుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది మే 19న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని భూములకు ఈ సోలార్ పంపులు వరంగా మారనున్నాయి. కేవలం సాగునీరు అందించడమే కాకుండా.. రైతును ఇంధన ఉత్పత్తిదారుడిగా మార్చడం ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revant Reddy
  • Congress Government
  • Indira Saura Giri Scheme
  • NABARD
  • telangana farmers
  • Telangana Farmers Celebrating
  • telangana government

Related News

Harish Rao Movie Tickets

మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

  • Telangana Government Press stickers

    బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

  • Bhukya Gowthami 

    పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

  • Telangana Transport Department

    వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచే

Latest News

  • మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

  • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

  • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

  • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

Trending News

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd