WTC Final: టీమిండియాలో రిషబ్ పంత్ లేని లోటు కనిపిస్తుంది: సౌరవ్ గంగూలీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ఫైనల్ (WTC Final) మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీల కారణంగా ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 06:21 AM, Sat - 10 June 23
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ఫైనల్ (WTC Final) మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీల కారణంగా ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కేవలం 296 పరుగులకే కుప్పకూలింది. దీంతో కంగారూలకు తొలి ఇన్నింగ్స్లో 173 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ తరఫున అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ అర్ధ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఇతర బ్యాట్స్మెన్లు నిరాశపరిచారు. టీమిండియా బ్యాటింగ్ లో అజింక్య రహానే అత్యధికంగా 89 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 51 పరుగులు చేశాడు.
రిషబ్ పంత్ను కోల్పోయిన భారత జట్టు
కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పెద్ద ప్రకటన చేశాడు. భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను కోల్పోతోందని సౌరవ్ గంగూలీ అన్నాడు. అలాగే భారత జట్టులో రిషబ్ పంత్ ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడని చెప్పాడు. కానీ పంత్ ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడడం లేదు. భారత మాజీ కెప్టెన్ ప్రకారం భారత జట్టులో రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నాడు.
Also Read: WTC Final 2023: ఫాలో ఆన్ తప్పినా ఆసీస్ దే పై చేయి
Ganguly said "India is missing Rishabh Pant which is a very important member of this team". pic.twitter.com/PGtVUiCGei
— Johns. (@CricCrazyJohns) June 9, 2023
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శన
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 296 పరుగులకె కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 173 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ తరఫున అజింక్య రహానే అత్యధికంగా 89 పరుగులు చేశాడు. అజింక్యా రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ యాభై పరుగుల మార్కును దాటాడు. ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ పాట్ కమిన్స్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో మిచెల్ స్టార్క్, స్కాట్ బౌలాండ్, కెమెరాన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీశారు.
Related News
Rishabh Pant Banned: ఢిల్లీకి బిగ్ షాక్.. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం..?
రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ కూడా వ్యవహరిస్తున్నాడు.