HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Virat Kohli Rohit Sharma Arrive In Nagpur Ahead Of First Odi

Virat Kohli- Rohit Sharma: నాగ్‌పూర్‌లో అడుగుపెట్టిన రోహిత్, కోహ్లీ

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం పలువురు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు.

  • By Naresh Kumar Published Date - 06:16 PM, Mon - 3 February 25
  • daily-hunt
Virat Kohli- Rohit Sharma
Virat Kohli- Rohit Sharma

Virat Kohli- Rohit Sharma: ఇంగ్లండ్‌తో ఆడనున్న 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో (Virat Kohli- Rohit Sharma) సహా టీమిండియా ఆటగాళ్లు నాగ్‌పూర్ చేరుకున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే టి20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ వన్డేలోనైనా రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. అటు యువ జట్టు సిరీస్ గెలవడంతో వన్డే సిరీస్ ను రోహిత్ సేన ఎలాగైనా గెలవాలని భావిస్తుంది.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం పలువురు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ మరియు రిషబ్ పంత్ కలిసి విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్, కోహ్లీ బ్లాక్ హుడీలో స్టైలిష్ లుక్స్ లో కనిపించారు. కాగా టి20 లో ఆడిన పలువురు ప్లేయర్లు వన్డేలోనూ స్థానం దక్కించుకున్నారు. అయితే ఈ ఆటగాళ్లు త్వరలో నాగ్ పూర్ చేరుకుని జట్టులో చేరనున్నారు. ఇందులో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఉన్నారు. రెండు జట్ల మధ్య జరిగిన టీ-20 సిరీస్‌లో భారత్ 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: High Court : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టు కీలక ఆదేశాలు

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు ఫామ్‌ను పొందాలనుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్ నాణ్యమైన బౌలింగ్ ముందు భారత బ్యాట్స్‌మెన్లు రాణించాలంటే కచ్చితంగా తమ పాత ఫామ్ ని తిరిగి పొందాల్సిందే. ఈ సిరీస్ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ ఉండటంతో ఆటగాళ్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా**, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ENG
  • Nagpur First ODI
  • rohit sharma
  • sports news
  • virat kohli

Related News

Yograj Singh

Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో యువరాజ్ ఒక శతకం, 4 అర్ధ శతకాలతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

  • Ross Taylor

    Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

  • Team India New Sponsor

    Team India New Sponsor: బీసీసీఐకి కొత్త స్పాన్స‌ర్‌.. రేసులో ప్ర‌ముఖ కార్ల సంస్థ‌!

  • Hardik Pandya

    Hardik Pandya: ఆసియా క‌ప్‌కు ముందు స‌రికొత్త లుక్‌లో హార్దిక్ పాండ్యా!

  • Amit Mishra

    Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో టీమిండియా క్రికెట‌ర్‌!

Latest News

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd