IND vs SL 2nd ODI: సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 293 మ్యాచ్లు ఆడాడు. 281 ఇన్నింగ్స్ల్లో మొత్తం 13,872 పరుగులు చేశాడు. అయితే విరాట్ 14,000 పరుగుల మార్క్ను అందుకోవడానికి 128 పరుగులు మాత్రమే కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేడు శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ 128 పరుగులు చేస్తే
- By Praveen Aluthuru Published Date - 07:57 PM, Sun - 4 August 24

IND vs SL 2nd ODI: భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డ్బద్దలవుతుంది. తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 24 పరుగులు చేశాడు, అయితే రెండో మ్యాచ్లో అతనిపై జట్టు మరియు అభిమానుల అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కోహ్లికి ఉంది. అయితే అందుకు కింగ్ కోహ్లీ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.
విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 293 మ్యాచ్లు ఆడాడు. 281 ఇన్నింగ్స్ల్లో మొత్తం 13,872 పరుగులు చేశాడు. అయితే విరాట్ 14,000 పరుగుల మార్క్ను అందుకోవడానికి 128 పరుగులు మాత్రమే కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేడు శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ 128 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
కోహ్లి ఇప్పటివరకు 293 వన్డేల్లో 281 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. కాగా టెండూల్కర్ 359 వన్డేల్లో 350 ఇన్నింగ్స్ల్లో 14,000 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ విషయంలో శ్రీలంక మాజీ బ్యాట్స్మెన్ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. సంగక్కర 402 వన్డే మ్యాచ్ల్లో 378 ఇన్నింగ్స్ల్లో 14,000 పరుగులు పూర్తి చేశాడు.
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు:
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కావడం గమనార్హం. వన్డేల్లో కోహ్లి పేరిట 50 సెంచరీలు ఉన్నాయి. సచిన్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి 80 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో 100 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.