India Wins Champions Trophy: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా!
భారత్ జట్టు తరపున రోహిత్ శర్మ 76 పరుగులు చేయగా.. శుభమన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ (1) నిరాశపర్చాడు.
- By Gopichand Published Date - 09:51 PM, Sun - 9 March 25

- ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం
- 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలుపొందిన భారత్
- 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్న భారత్
- ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ
India Wins Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా (India Wins Champions Trophy) ఘనవిజయం సాధించి ట్రోఫీని గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు తరపున రోహిత్ శర్మ 76 పరుగులు చేయగా.. శుభమన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ (1) నిరాశపర్చాడు. అయ్యర్ 48 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 29 పరుగులు చేశాడు. హార్థిక్ పాండ్యా (18), కేఎల్ రాహుల్ అజేయంగా 34 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులు చేసి భారత్ జట్టుకు విజయాన్ని అందించారు.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆#TeamIndia 🇮🇳 HAVE DONE IT! 🔝👏
ICC Men's T20 World Cup 2024 Champions 😍#T20WorldCup | #SAvIND pic.twitter.com/WfLkzqvs6o
— BCCI (@BCCI) June 29, 2024
Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్రలు పోషించారు. దీంతో భారత్ 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. 2017లో ఫైనల్లో భారత్పై పాకిస్థాన్ విజయం సాధించింది. చివర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా జోడీ జట్టును విజయతీరాలకు చేర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన భారత్కు శుభారంభం లభించింది.
రోహిత్, గిల్ 105 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత గిల్ 31 పరుగుల వద్ద కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేతిలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా 1 పరుగు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. 76 పరుగుల స్కోరు వద్ద రోహిత్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ స్కోరు 122 పరుగులకు 3 వికెట్లు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ మధ్య 61 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యం ఏర్పడి భారత్ను ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది.
కానీ 48 పరుగుల స్కోరు వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించిన అయ్యర్ను కెప్టెన్ సాంట్నర్ వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ కూడా 29 పరుగుల వద్ద ఔటయ్యాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మైకేల్ బ్రేస్వెల్ ఖాతాలో ఉన్నాయి. చెరో 2 వికెట్లు తీశారు. రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్ చెరో వికెట్ తీశారు.