Irani Cup 2024: అయ్యర్కి బీసీసీఐ చివరి అవకాశం
Irani Cup 2024: ఇరానీ కప్ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సీనియర్లు దిగనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇరానీ కప్ మ్యాచ్లో వెటరన్ అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఇరానీ కప్లో శ్రేయాస్ అయ్యర్, రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొనబోతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:38 PM, Tue - 24 September 24

Irani Cup 2024: ఒకవైపు టీమ్ ఇండియా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అదే సమయంలో అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ ప్రారంభం కానుంది. ఈ దేశవాళీ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున శ్రేయాస్ అయ్యర్ (shreyas iyer) ఆడబోతున్నాడు. ఇక్కడ రాణిస్తే అయ్యర్ కు టీమ్ ఇండియాలో పునరాగమనం చేసే గొప్ప అవకాశం ఉంది.
ఇరానీ కప్(irani cup) అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సీనియర్లు దిగనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇరానీ కప్ మ్యాచ్లో వెటరన్ అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఇరానీ కప్లో శ్రేయాస్ అయ్యర్, రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొనబోతున్నారు. రహానే ఇప్పటికే రంజీ ట్రోఫీలో ముంబై జట్టును చాంపియన్గా నిలిపాడు. ఇప్పుడు ఇరానీ కప్లో అతని నాయకత్వంలో ముంబై జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. శార్దూల్ మరియు అయ్యర్ ఇద్దరూ దులీప్ ట్రోఫీలో ఆడుతూ కనిపించారు.ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ పాల్గొన్నప్పటికీ అతని మునుపటి ప్రదర్శన చూపించలేకపోయాడు. అయితే టోర్నీ మొదట్లో నిరాశపరిచిన అయ్యర్ ఆ తర్వాత 2 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్లు ఆడాడు. కాగా సంవత్సరం ప్రారంభంలో అయ్యర్ను బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది.
గంభీర్ కోచ్గా మారిన వెంటనే అయ్యర్ టీమ్ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో పునరాగమనం చేయడం స్టార్ బ్యాట్స్మెన్కు చాలా కష్టంగా కనిపిస్తోంది. పునరాగమనం చేయాలంటే అయ్యర్ ఇరానీ కప్లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ భారత్ తరఫున 14 టెస్టు మ్యాచ్లు ఆడాడు, అందులో అతను 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. 62 వన్డే మ్యాచ్లు ఆడాడు, అందులో 47.47 సగటుతో 2421 పరుగులు చేశాడు. 51 టి20 మ్యాచ్లలో 1104 పరుగులు చేశాడు. ఇరానీ కప్లో అయ్యర్ అద్భుతంగా రాణిస్తే వచ్చే సిరీస్లో అతడిని టీమిండియాలోకి తీసుకోవచ్చు.
Also Read: Kamareddy: ఆరేళ్ళ పాపపై పీఈటీ అసభ్య ప్రవర్తన