Rohit Sharma: రోహిత్ శర్మకు ఊహించని షాక్ ఇచ్చిన బీసీసీఐ!
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇకపై టెస్టు మ్యాచ్ల జట్టులో చేర్చే అవకాశం లేదని, ఈ ఏడాది జూన్-జూలైలో జరిగే ఇంగ్లండ్ టూర్ నుండి టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ బుమ్రా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిస్తాడని PTI నివేదించింది.
- By Gopichand Published Date - 05:11 PM, Sat - 15 February 25

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జస్ప్రీత్ బుమ్రా గురించి భారత జట్టు మేనేజ్మెంట్ ఎటువంటి రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే BCCI అతన్ని కాబోయే టెస్టు కెప్టెన్గా పరిగణిస్తోంది. నితిన్ పటేల్ నేతృత్వంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సిఎ) తన నివేదికలో బుమ్రా తాజా స్కాన్ నివేదికలో ఎలాంటి తప్పు లేదని, అయితే అతను ఇంకా పూర్తిగా బౌలింగ్ ప్రారంభించలేదని పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా వారం మాత్రమే సమయం ఉంది కాబట్టి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. జూన్లో ఇంగ్లండ్తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్లో బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇకపై టెస్టు మ్యాచ్ల జట్టులో చేర్చే అవకాశం లేదని, ఈ ఏడాది జూన్-జూలైలో జరిగే ఇంగ్లండ్ టూర్ నుండి టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ బుమ్రా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిస్తాడని PTI నివేదించింది. బుమ్రా తన పూర్తి సామర్థ్యంతో ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించకపోవడమే వివాదానికి ప్రధాన కారణమని అర్థమైంది. ఈ విషయంపై అవగాహన ఉన్నవారు ఇంత తక్కువ సమయంలో మ్యాచ్కు ఫిట్గా ఉండటం చాలా కష్టమని అంటున్నారు. అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడే అవకాశం ఉంది. ఆపై రోహిత్ శర్మ మళ్లీ టెస్టులకు ఎంపికయ్యే అవకాశం లేనందున ఇంగ్లాండ్లో భారత జట్టుకు నాయకత్వం వహించవచ్చు అని రాసుకొచ్చింది.
Also Read: Singer Mangli: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. స్పందించిన సింగర్ మంగ్లీ!
రోహిత్ శర్మను టెస్టు జట్టులోకి తీసుకోబోమని, 31 ఏళ్ల బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారులు సైతం స్పష్టం చేసినట్లు సమాచారం. రెడ్ బాల్ క్రికెట్లో బుమ్రా భారత జట్టుకు వైస్ కెప్టెన్ కాబట్టి అతన్ని కెప్టెన్ చేసే అవకాశాలు ఎక్కువ. అతను ఇప్పటికే కొన్ని సందర్భాల్లో టీమ్ ఇండియాకు కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం వెన్నులో గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను త్వరలో ఫిట్గా తిరిగి రాగలడు. ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు బుమ్రా కెప్టెన్గా ఉంటే రోహిత్ శర్మ రెడ్ బాల్ క్రికెట్ కెరీర్ దాదాపుగా ముగిసిపోతుందని విశ్లేషికులు అంచనా వేస్తున్నారు.