Rohit Sharma Retirement: మెల్బోర్న్లో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెబుదామనుకున్నాడా?
'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రకారం.. రోహిత్- ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సంబంధాలు ఇప్పటివరకు సరిగ్గా లేవు. మైదానంలో వ్యూహరచన నుంచి జట్టు కూర్పు వరకు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.
- Author : Gopi
Date : 12-01-2025 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma Retirement: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన మధ్య భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Retirement) గురించి ఒక పెద్ద వార్త బయటికొచ్చింది. ఈ అనుభవజ్ఞుడైన ఆటగాడు ఆస్ట్రేలియాతో జరిగిన మెల్బోర్న్ టెస్ట్ తర్వాత క్రికెట్లోని అతిపెద్ద ఫార్మాట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడని దాని సారాంశం. అయితే సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషులు రోహిత్ మనసు మార్చినట్లు తెలుస్తోంది.
రోహిత్ తనకు కొడుకు పుట్టడం వల్ల బోర్డర్-గవాస్కర్ సిరీస్లోని మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు. అడిలైడ్లో ఆడిన రెండవ టెస్టులో తిరిగి వచ్చాడు. అతను కెప్టెన్గా ఉండటంతో ఈ సిరీస్లో జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత అతను సిరీస్లోని ఐదవ, చివరి మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. రోహిత్ నిర్ణయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సిరీస్ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది.
Also Read: Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రకారం.. రోహిత్- ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సంబంధాలు ఇప్పటివరకు సరిగ్గా లేవు. మైదానంలో వ్యూహరచన నుంచి జట్టు కూర్పు వరకు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ మొత్తం ఘటనపై ఒక వ్యక్తి మాట్లాడుతూ.. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన నాల్గవ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని శ్రేయోభిలాషులు అతని మనసు మార్చుకోమని బలవంతం చేశారు. దీంతో హిట్ మ్యాన్ రిటైర్మెంట్పై వెనక్కి తగ్గాడు. లేకుంటే రోహిత్ ఆరోజే రిటైర్మెంట్ ప్రకటించేవాడని పేర్కొన్నారు.
టాప్ ఆర్డర్ అయినా, మిడిల్ ఆర్డర్ అయినా, రోహిత్ సిరీస్లో బ్యాటింగ్తో నిరంతర వైఫల్యం చెంది విమర్శలను ఎదుర్కొన్నాడు. రోహిత్ సిరీస్లో ఐదు ఇన్నింగ్స్లు ఆడాడు. ఇందులో బ్యాట్తో 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన తర్వాతే కంగారూ జట్టుతో జరిగిన ఐదో టెస్టు నుంచి వైదొలిగాడు. ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో భారత్ పదేళ్ల తర్వాత కంగారూ జట్టుతో బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోల్పోయింది.