CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
- Author : Praveen Aluthuru
Date : 01-05-2024 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
ఐపీఎల్ 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. పంజాబ్ తన సొంతగడ్డపై చెన్నైని 7 వికెట్ల తేడాతో ఓడించింది. పంజాబ్ ఈ విజయంతో ప్లేఆఫ్ రేసులో ఉత్కంఠ పెరిగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్కు సరైన ఆరంభం లభించలేదు. 13 పరుగుల వద్ద ప్రభసిమ్రన్ ఔటయ్యాడు. దీని తర్వాత రిలే రూసో మరియు జానీ బెయిర్స్టో జట్టు బాధ్యతను తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ జట్టును 100 పరుగుల మార్క్ కు చేర్చారు. బెయిర్స్టో 46 పరుగులు, రిలే రూసో 43 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం కెప్టెన్ సామ్ కుర్రాన్ (26 నాటౌట్), శశాంక్ సింగ్ (25 నాటౌట్) రాణించడంతో పంజాబ్ 17.5 ఓవర్లలో 163 పరుగులతో విజయం సాధించింది.
We’re now on WhatsApp. Click to Join
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్కు 163 పరుగుల లక్ష్యాన్ని అందించింది. రుతురాజ్ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. గైక్వాడ్ క్రీజులో ఉన్నంత సేపు చెన్నై స్కోరు పరుగులు పెట్టింది. అయితే గైక్వాడ్ అవుట్ కాగానే స్కోర్ నెమ్మదించింది. శివమ్ దూబే (0) రవీంద్ర జడేజా (2) సమీర్ రిజ్వీ 21, మొయిన్ అలీ 15, ధోనీ 14 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2, రాహుల్ చహర్ 2, కగిసో రబాడా 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
Also Read: Big Relief to Janasena : ఊపిరి పీల్చుకున్న జనసేన..ఇక ఆ టెన్షన్ అవసరం లేదు