Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపేనా..? మరిన్ని మ్యాచ్లు డిమాండ్ చేస్తున్న పాక్ ..!
క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ (Asia Cup 2023) కోసం వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన కొత్త డిమాండ్ కారణంగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
- By Gopichand Published Date - 10:39 AM, Sun - 16 July 23
Asia Cup 2023 Schedule: క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ (Asia Cup 2023) కోసం వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన కొత్త డిమాండ్ కారణంగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ఇందులో టోర్నీలో తొలి 4 మ్యాచ్లు పాకిస్థాన్లో జరగనున్నాయి. ఇక మిగిలిన 9 మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి.
ఈ మోడల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదించారు. భారత జట్టు పాకిస్థాన్లో ఆడకూడదని నిర్ణయించుకోవడంతో ఈ మోడల్లో టోర్నీని నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు కొత్త పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పాకిస్థాన్ మరిన్ని మ్యాచ్లు డిమాండ్ చేస్తోంది.
ఆసియా కప్ షెడ్యూల్లో జాప్యానికి సంబంధించి జూలై 16న జరిగే ACC సమావేశంలో మరిన్ని మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తుతుందని పిసిబి మూలాధారం పిటిఐకి ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంకలో మ్యాచ్లు జరిగే సమయానికి వర్షం కురిసే అవకాశం ఉన్నందున పాకిస్థాన్లో మరిన్ని మ్యాచ్లు నిర్వహించాలని పాక్ బోర్డు కోరుతున్నట్లు సమాచారం.
దంబుల్లాలో భారత్-పాక్ల మధ్య పోరు..?
వచ్చే ఆసియా కప్లో దంబుల్లా మైదానంలో భారత్-పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 2 మ్యాచ్లు ఉంటాయని, అందులో ఒక గ్రూప్ మ్యాచ్ అయితే మరొకటి సూపర్-4 స్టేజ్లో ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో పిసిబి ముల్తాన్ స్టేడియంలో ఆసియా కప్ మ్యాచ్లను నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా స్టేడియం దాని చిన్న పరిమాణం కారణంగా మరింత రద్దీగా కనిపిస్తుంది. వచ్చే ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లను రెండో గ్రూపులో చేర్చారు.
Related News
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.