IPL 2025 On March 14: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మూడు సీజన్ల షెడ్యూల్ విడుదల!
2025 సీజన్లో గత మూడు సీజన్ల మాదిరిగానే 74 మ్యాచ్లు ఆడనున్నారు. అనేక పూర్తి సభ్య దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో తదుపరి మూడు సీజన్లలో ఆడేందుకు తమ బోర్డుల నుంచి అనుమతి పొందారు.
- Author : Gopichand
Date : 22-11-2024 - 9:47 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2025 On March 14: ప్రస్తుతం ఐపీఎల్ 2025 (IPL 2025 On March 14) మెగా వేలం గురించి మాత్రమే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ టోర్నీ మార్చి 14 నుంచి మే 25 వరకు జరగనుంది. వచ్చే ఏడాది మాత్రమే కాకుండా 2026, 2027 సీజన్ల తేదీలను కూడా ప్రకటించారు. ఐపీఎల్ 2026లో మార్చి 15 నుంచి ప్రారంభం కాగా ఫైనల్ మే 31న జరగనుంది. 2027 సంవత్సరంలో ఈ లీగ్ మార్చి 14 నుండి ప్రారంభమవుతుంది. మే 30 వరకు కొనసాగుతుంది.
Also Read: Today Gold Rate: నేటి బంగారం ధరలివే.. పెరిగాయా? తగ్గాయా?
2025 సీజన్లో గత మూడు సీజన్ల మాదిరిగానే 74 మ్యాచ్లు ఆడబడతాయి. అనేక పూర్తి సభ్య దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో తదుపరి మూడు సీజన్లలో ఆడేందుకు తమ బోర్డుల నుంచి అనుమతి పొందారు. ఇందులో 2008 నుంచి ఐపీఎల్లో ఆడే అవకాశం లేని పాక్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు.
IPL 2025లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ, దేశీయ ఆటగాళ్లందరినీ ఆమోదించింది. అయితే 2026లో ఆస్ట్రేలియా పాకిస్థాన్లో మూడు మ్యాచ్ల ODI సిరీస్ను ఆడాల్సి ఉంది. ఇది మార్చి 18 లోపు ముగుస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
మూడు సీజన్లకు అనేక దేశాల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు
పాకిస్థాన్తో సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు IPL 2026లో చేరనున్నారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 18 సెంట్రల్ కాంట్రాక్ట్లను పొందిన ఆటగాళ్ల జాబితాను కూడా సమర్పించింది. వారు తదుపరి మూడు సీజన్లకు అందుబాటులో ఉంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే ఆటగాళ్లు కూడా వచ్చే మూడు సీజన్లకు పూర్తిగా అందుబాటులో ఉంటారు.
ఐపీఎల్ వేలం జెడ్డాలో జరగనుంది
వచ్చే ఏడాది ఐపీఎల్ 2025కి ముందు సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇందులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్ వంటి ఆటగాళ్ల భవితవ్యం తెలియనుంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. 574 మంది ఆటగాళ్లలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు, వీరిలో 3 అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.