IPL 2022: గిన్నిస్ బుక్ లో ఐపీఎల్ 2022 ఫైనల్
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసిన ఐపీఎల్ కు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది.
- By Hashtag U Published Date - 11:57 AM, Mon - 28 November 22
![IPL 2022: గిన్నిస్ బుక్ లో ఐపీఎల్ 2022 ఫైనల్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/11/ipl-recordj.jpg)
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసిన ఐపీఎల్ కు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. ఈ ఏడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు ఈ పురస్కారం లభించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ మోతేరా స్టేడియం వేదికగా ఈ ఫైనల్ కి రికార్డు స్థాయిలో 101, 566 మంది హాజరయ్యారు. ఓ క్రీడా ఈవెంట్కు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి అవార్డు అందజేశారు.
ఈ అవార్డు అందుకోవడంపై బీసీసీఐ సెక్రటరీ జైషా సంతోషం వ్యక్తం చేశాడు. చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. గతంలో అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియం సీటింగ్ కెపాసిటీ 49 వేలు మాత్రమే ఉండేది. అయితే స్టేడియాన్ని ఆధునీకరణ చేసిన తర్వాత లక్షా 32 వేలకు సీటింగ్ కెపాసిటీని పెంచారు. ఇదిలా భారత్ గిన్నిస్ రికార్డు సృష్టించడం ప్రతీ ఒక్కరికి గర్వకారణమనీ, అభిమానులు ఇచ్చిన తిరుగులేని మద్దతుకు లభించిన పురస్కారం. అందరికి అభినందనలని బీసీసీఐ ట్వీట్ చేసింది.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![IPL 2025: గుజరాత్ టైటాన్స్ కు నెహ్రా బై..బై.. కొత్త కోచ్ గా సిక్సర్ల కింగ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/IPL-2025-2.jpg)
IPL 2025: గుజరాత్ టైటాన్స్ కు నెహ్రా బై..బై.. కొత్త కోచ్ గా సిక్సర్ల కింగ్
ఆశిష్ నెహ్రా స్థానంలో సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ను గుజరాత్ టైటాన్స్ తమ కోచ్ గా నియమించకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనిపై యువీతో చర్చలు కూడా జరిపినట్టు, అతను కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం