నమీబియాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
భారత జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్తో పాటు రెండు శుభవార్తలు కూడా అందాయి. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరాడు.
- Author : Gopichand
Date : 10-02-2026 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
Abhishek Sharma: నమీబియాతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమ్ ఇండియాకు ఒక చేదు వార్త అందింది. జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో నమీబియాతో జరిగే పోరులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. టీమ్ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోస్చాట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. అభిషేక్ ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాడని వెల్లడించారు. అయితే భారత్ ఆడబోయే రెండో మ్యాచ్ సమయానికి అతను ఫిట్ అవుతాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిషేక్ ఫిట్నెస్పై అప్డేట్
అభిషేక్ శర్మ కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, దాని నుండి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని కోచ్ తెలిపారు. ఒకవేళ అభిషేక్ ఈ మ్యాచ్కు దూరమైతే,తుది జట్టులో సంజు శాంసన్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అమెరికాతో జరిగిన గత మ్యాచ్లో సంజుకు తుది జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే.
Also Read: అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
జట్టుతో చేరిన వాషింగ్టన్ సుందర్.. బుమ్రా రీ-ఎంట్రీ
భారత జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్తో పాటు రెండు శుభవార్తలు కూడా అందాయి. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరాడు. ఇటీవల అతను వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అతను కూడా ఇంకా వంద శాతం ఫిట్నెస్ సాధించాల్సి ఉంది. టీమ్ ఇండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నమీబియాతో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. అనారోగ్యం కారణంగా అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్కు దూరమైన బుమ్రా, ఈరోజు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడని కోచ్ ధృవీకరించారు. భారత్- నమీబియా మధ్య ఈ ఆసక్తికర పోరు ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.