India vs Pakistan: భారత్ వర్సెస్ పాకిస్థాన్.. చివరి 10 వన్డేల్లో ఆధిపత్యం ఎవరిదంటే..?
సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది.
- By Gopichand Published Date - 01:21 PM, Thu - 20 July 23
India vs Pakistan: ఆసియా కప్ 2023 షెడ్యూల్ను గత బుధవారం (జూలై 19) ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జై షా విడుదల చేశారు. టోర్నీ ఆగస్టు 30న ప్రారంభమై ఫైనల్ సెప్టెంబర్ 15న జరగనుంది. అదే సమయంలో సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్లో భారత జట్టు పాకిస్థాన్పై ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చూద్దాం.
T20 వరల్డ్ 2022 కప్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. ఇందులో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో 2022లో ఆడిన ఆసియా కప్లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్లు జరిగాయి. ఇందులో రెండు జట్లు 1-1 గెలిచాయి. ఇది కాకుండా వన్డేల గురించి మాట్లాడుకుంటే.. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన చివరి 3 వన్డేల్లోనూ టీమిండియా విజయంతో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడిన ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య రెండుసార్లు తలపడగా రెండుసార్లు టీమ్ ఇండియానే గెలిచింది.
మాంచెస్టర్లో 2019 ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ మధ్య చివరి ODI మ్యాచ్ జరిగింది. ఇందులో భారత జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆసియాకప్లో పాకిస్థాన్పై భారత్దే పైచేయి పూర్తిగా ఉండబోతోందని భావించవచ్చు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్: చివరి 10 వన్డేల్లో భారత్ ఆధిపత్యం
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన చివరి 10 వన్డేల్లో భారత్ 7 విజయాలు సాధించగా, పాకిస్థాన్ 3 మాత్రమే గెలిచింది. అదే సమయంలో, ODI ఆసియా కప్లో ఇరు జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడగా, ఇందులో భారత్ 7 విజయాలు సాధించగా, పాకిస్తాన్ 5 మ్యాచ్లు గెలిచింది. అయితే 1 మ్యాచ్ ఫలితం తేలలేదు.
Related News
Pak : భారత్ చంద్రుడిపై కాలుపమోపింది..మరి మనం..పాక్ చట్ట సభ్యుడి కీలక వ్యాఖ్యలు
Pakistan: భారత్(India) సాధిస్తున్న విజయాలు..పాకిస్థాన్(Pakistan) దయనీయ స్థితిని వివరిస్తూ.. ఆదేశ చట్టసభ సభుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. భారత్ చంద్రుడి మీద కాలుమోపింది..మరి పాకిస్థాన్లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్ చట్ట సభ్యుడు, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ కీలక వ్యాఖ్యలు చే�