India vs England: నాగ్పూర్ వన్డేలో చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్లోనే బంతితో విధ్వంసం సృష్టించాడు. హర్షిత్ ఒకే ఓవర్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్లకు పెవిలియన్ కు దారి చూపించాడు.
- By Gopichand Published Date - 05:18 PM, Thu - 6 February 25

India vs England: నాగ్పూర్ వన్డేలో చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
India vs England: తన T-20 అంతర్జాతీయ అరంగేట్రంలో విధ్వంసం సృష్టించిన తరువాత, హర్షిత్ రాణా ODIలలో కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్ చేయలేనిది రాణా చేశాడు. నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో (India vs England) జరుగుతున్న తొలి వన్డేలో హర్షిత్ చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రం మ్యాచ్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా హర్షిత్ నిలిచాడు. ఇంగ్లండ్కు చెందిన ఇద్దరు బ్యాట్స్మెన్లకు హర్షిత్ ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపాడు. అదే సమయంలో రాణా.. లియామ్ లివింగ్స్టన్ను కూడా అవుట్ చేశాడు.
హర్షిత్ చరిత్ర సృష్టించాడు
హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్లోనే బంతితో విధ్వంసం సృష్టించాడు. హర్షిత్ ఒకే ఓవర్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్లకు పెవిలియన్ కు దారి చూపించాడు. దీని తర్వాత హర్షిత్ లియామ్ లివింగ్స్టన్ను కూడా అవుట్ చేశాడు. మూడు ఫార్మాట్లలో తన అరంగేట్రం మ్యాచ్లోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత్ నుంచి తొలి బౌలర్గా హర్షిత్ నిలిచాడు. టీ-20 ఇంటర్నేషనల్లో అరంగేట్రం చేసిన హర్షిత్ ఇంగ్లండ్పై 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాతో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన హర్షిత్ 48 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
Also Read: Repo Rate: గుడ్ న్యూస్ చెప్పనున్న ఆర్బీఐ.. వడ్డీ రేట్లను తగ్గించనుందా?
ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు
నాగ్పూర్లో హర్షిత్ రాణా అరంగేట్రం చిరస్మరణీయం. ఇంగ్లండ్కు అత్యంత భయంకరమైన ఇద్దరు బ్యాట్స్మెన్లను ఫాస్ట్ బౌలర్ కేవలం ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన హర్షిత్ మొదట బెన్ డకెట్ ను ట్రాప్ చేసి 32 పరుగుల వద్ద ఔట్ చేశాడు. డకెట్ను పెవిలియన్కు పంపిన హర్షిత్ కేవలం రెండు బంతుల్లోనే హ్యారీ బ్రూక్ను అవుట్ చేశాడు. అయితే హర్షిత్ వేసిన ఒకే ఓవర్లో సాల్ట్ 26 పరుగులు చేశాడు. ఈ ఓవర్లో ఇంగ్లిష్ ఓపెనర్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. హర్షిత్తో పాటు యశస్వి జైస్వాల్ కూడా భారత జట్టు నుండి ఈ మ్యాచ్లో వన్డే క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు.
భారత్ లక్ష్యం ఎంతంటే?
వన్డే సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్, డకెట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, జడేజా కీలక వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ నెమ్మదించింది. బట్లర్ (52), జాకబ్ (51), సాల్ట్ (43) మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు భారత్ ముందు 249 పరుగుల టార్గెట్ను ఉంచింది.