India vs Bangladesh: పరువు కోసం టీమిండియా.. క్లీన్స్వీప్పై బంగ్లా గురి
- By Gopichand Published Date - 09:30 AM, Sat - 10 December 22
నేడు బంగ్లాతో (India vs Bangladesh) ఆఖరి వన్డేకు సిద్ధమైంది భారత్. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) ఇక ఆడాల్సింది పరువు నిలుపుకోవడం కోసమే. ఈ మ్యాచ్ చట్టోగ్రామ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతూ భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి టీమిండియాను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ శనివారం చిట్టగాంగ్ వేదికగా జరగనుంది. సిరీస్లో బంగ్లాదేశ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. టీమ్ ఇండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ను ఎలాగైనా ఆపాలని కోరుకుంటోంది. భారత శిబిరం పేలవ ప్రదర్శనతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతోంది. గాయం కారణంగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఇప్పుడు క్లీన్ స్వీప్ను నిలిపివేసేందుకు ప్లేయింగ్ ఎలెవన్లో మార్పుతో పాటు ప్రత్యేక ప్రణాళికతో జట్టును రంగంలోకి దిగనుంది.
వన్డే సిరీస్లో చివరి మ్యాచ్లో టీమిండియా ‘మాస్టర్ ప్లాన్’తో బరిలోకి దిగుతుంది. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. భారత జట్టు కుల్దీప్ను జట్టులోకి తీసుకుంది. కానీ అతను ప్లేయింగ్ ఎలెవన్లో చేరడం కష్టం. కుల్దీప్ స్పిన్ బౌలర్.అక్షర్ పటేల్ చివరి మ్యాచ్లో ప్లేయింగ్ XIలో భాగంగా ఉన్నాడు మరియు అతను అర్ధ సెంచరీ చేశాడు. అందువల్ల ప్లేయింగ్ ఎలెవన్లో అక్షర్కు దూరం కావడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో షహబాజ్ అహ్మద్ లేదా కుల్దీప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. అయితే భారత్కు వికెట్లు తీయగల మంచి బౌలర్ అవసరం.
Also Read: BSNL 5g: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి 5 జీ సేవలు?
వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ 1 వికెట్ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. బంగ్లాదేశ్ చివరి వికెట్ను టీమిండియా బౌలర్లు తీయలేకపోయారు. ఈ కారణంగానే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండో వన్డేలోనూ భారత జట్టు ఉత్కంఠభరితంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. అయినప్పటికీ బ్యాటింగ్కు వచ్చి అజేయ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
భారత జట్టు అంచనా: కేఎల్ రాహుల్ (C), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (WK), శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
Related News
KL Rahul: కేఎల్ రాహుల్ కళ్ళలో బాధ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా
టీమిండియాలో మోస్ట్ స్టైలిష్ బ్యాటర్గా పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్ జట్టుకు సెలెక్ట్ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గాయంతో చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతంగ రాణిస్తున్నాడు. ప్రపంచకప్ కు ముందు ఆసీస్ తో జరిగిన సిరీస్ లోను రాహుల్ బాగా ఆడాడు