PM Modi: మహారాష్ట్ర, గోవాలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఎప్పుడంటే..?
- By Gopichand Published Date - 06:55 AM, Sat - 10 December 22
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) డిసెంబర్ 11న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. మోదీ (PM Modi) మహారాష్ట్ర పర్యటన సందర్భంగా రూ. 75,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. నాగ్పూర్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ను కు జెండా ఊపి నాగ్పూర్ మెట్రో మొదటి దశను ప్రారంభించనున్నారు. గోవాలో మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు.మహారాష్ట్రలో రూ.75,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
నాగ్పూర్ మెట్రో రెండవ దశకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. నాగ్పూర్, షిర్డీలను కలుపుతూ సమృద్ధి మహామార్గం మొదటి దశను ప్రారంభిస్తారు. నగరంలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్ను జాతికి అంకితం చేస్తారు. విదర్భ నగరంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ.1,500 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
Also Read: Maharastra: మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్లు నరికివేత?
ప్రధాని మోదీ నాగ్పూర్ పర్యటన పూర్తి వివరాలు
– ప్రధాని మోదీ ఉదయం 9.30 గంటలకు నాగ్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభిస్తారు ప్రారంభం చేస్తారు.
– ఉదయం 10 గంటలకు ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ఖాప్రీ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైడ్లో ప్రయాణించే ప్రధాని అక్కడ ‘నాగ్పూర్ మెట్రో మొదటి దశ’ను జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ‘నాగ్పూర్ మెట్రో ఫేజ్-2’కి శంకుస్థాపన చేస్తారు.
– 10:45 PMకి నాగ్పూర్, షిర్డీలను కలుపుతూ సమృద్ధి హైవే మొదటి దశను ప్రారంభించి, హైవేని సందర్శిస్తారు.
– నాగ్పూర్లోని ఎయిమ్స్ను ఉదయం 11:15 గంటలకు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
– 11.30 గంటలకు నాగ్పూర్లో 1500 కోట్లకు పైగా ఖర్చుతో కూడిన రైలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఇది కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (NIO), నాగ్ రివర్ పొల్యూషన్ అబెట్మెంట్ ప్రాజెక్ట్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రాపూర్లోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET)ని జాతికి అంకితం చేస్తారు. ‘సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతీస్, చంద్రపూర్’ని ప్రారంభిస్తారు.
గోవాలో ప్రధాని మోదీ పర్యటన పూర్తి వివరాలు
– గోవాలో మధ్యాహ్నం 3:15 గంటలకు తొమ్మిదో ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన మూడు జాతీయ ఆయుష్ సంస్థలను కూడా ప్రారంభిస్తారు.
– సాయంత్రం 5:15 గంటలకు మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
Related News
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో �