IND VS SA 1st ODI: చెలరేగిన హర్షదీప్: భారత్ విజయ లక్ష్యం 117 పరుగులు
భారత్ ,దక్షిణాది మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమ్ ఇండియా అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు మోకరిల్లారు
- By Praveen Aluthuru Published Date - 05:34 PM, Sun - 17 December 23

IND VS SA 1st ODI: భారత్ ,దక్షిణాది మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమ్ ఇండియా అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు మోకరిల్లారు. దీంతో భారత్ విజయ లక్ష్యం 117 పరుగులు మాత్రమే. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. కె.ఎల్. రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్గా ఉండగా, దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్క్రామ్ నాయకత్వం వహిస్తున్నాడు. మార్క్రామ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తొలి వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా లీడింగ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఆఫ్రికన్ జట్టుకు పెద్ద దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్లోనే వరుసగా రెండు వికెట్లు తీశాడు. ఇది ఆఫ్రికన్ జట్టుపై ఒత్తిడి పెంచడానికి భారత జట్టుకు సహాయపడింది మరియు ఒత్తిడిలో మొత్తం జట్టు 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. 52 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా జట్టులో సగం మంది పెవిలియన్కు చేరుకున్నారు. టీమిండియా తరఫున అర్ష్దీప్ సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. నంద్రా బర్గర్ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్రికా ఇన్నింగ్స్ను ముగించాడు.
Also Read: Yadadri Bhuvangiri: కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు