భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావరణం ఎలా ఉంటుందంటే?!
భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
- Author : Gopichand
Date : 29-01-2026 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs NZ 5th T20: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో భారత్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ 1 మ్యాచ్లో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ వర్షం అంతరాయం కలిగించలేదు. మరి ఐదో మ్యాచ్కు వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరువనంతపురం వాతావరణ నివేదిక
ఆక్యువెదర్ (AccuWeather) నివేదిక ప్రకారం.. భారత్-న్యూజిలాండ్ ఐదో మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. రోజంతా ఎండ కాస్తూ, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది.
Also Read: పీఎం కిసాన్ పథకం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!
ఉష్ణోగ్రత: గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్.
వర్ష సూచన: 0 శాతం (వర్షం పడే అవకాశం లేదు).
గాలి వేగం: గంటకు 14 కిలోమీటర్లు.
తేమ: 54 శాతం.
సిరీస్ పరిస్థితి
తొలి మూడు మ్యాచ్ల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి వరుస విజయాలతో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే నాలుగో మ్యాచ్లో న్యూజిలాండ్ పుంజుకుని విజయం సాధించింది. ఇప్పుడు ఐదో మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఘనంగా ముగించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, శివమ్ దూబే మరియు అక్షర్ పటేల్.
న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, క్రిస్టియన్ క్లార్క్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, విల్ యంగ్.