Star Player Comeback: రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్..!
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్కి పునరాగమనం చేసిన వెటరన్ ఆటగాడు మరెవరో కాదు.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. 2022 డిసెంబర్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
- By Gopichand Published Date - 10:24 AM, Thu - 19 September 24

Star Player Comeback: భారత క్రికెట్ జట్టు నేటి నుంచి బంగ్లాదేశ్తో 2 టెస్టుల క్రికెట్ సిరీస్ మొదలైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఆ తర్వాత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా ప్లేయింగ్-11లో ఉన్న ఓ ఆటగాడు (Star Player Comeback) రెండేళ్ల తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్లోకి వచ్చాడు.
ఈ స్టార్ ప్లేయర్ ఎవరు?
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్కి పునరాగమనం చేసిన వెటరన్ ఆటగాడు మరెవరో కాదు.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. 2022 డిసెంబర్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత క్రికెట్కు విరామం ఇచ్చాడు. తన కృషి, ఉత్సాహంతో పునరాగమనం చేశాడు. టీమ్ ఇండియాలో తన స్థానాన్ని మళ్లీ ధృవీకరించుకున్నాడు. రిషబ్ పంత్ తన చివరి టెస్టు మ్యాచ్ను 632 రోజుల క్రితం 2022లో బంగ్లాదేశ్తో ఆడాడు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో పంత్ మళ్లీ పునరాగమనం చేశాడు. అతను ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లను వెనక్కినెట్టి ప్లేయింగ్-11లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Also Read: Indian Students : భారత విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్.. స్టడీ పర్మిట్లు తగ్గింపు
ముఖ్యమైన పాత్ర పోషించగలడు
బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో టీమిండియా తరఫున రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించగలడు. రిషబ్ పంత్ బంగ్లాదేశ్తో ఇప్పటివరకు కేవలం 2 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అందులో అతను 148 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 93 పరుగులు. టీమ్ ఇండియాకు రిషబ్ పంత్ ఎంత ముఖ్యమో.. మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో ఆ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ ఎంత ప్రమాదకరమో..? టెస్టు క్రికెట్లో ఏం చేయగలడో అందరికీ తెలుసునని అన్నాడు. అతను ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పరుగులు సాధించాడు. మ్యాచ్లను గెలవడానికి మార్గం సుగమం చేయగల అతనిలాంటి ఆటగాడు ఉండటం ఎల్లప్పుడూ జట్టుకు మంచిదేనని గంభీర్ చెప్పుకొచ్చాడు.
రిషబ్ పంత్ టెస్ట్ కెరీర్ ఎలా ఉంది?
రిషబ్ పంత్ ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టు తరపున మొత్తం 33 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2271 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 159 పరుగులు.