World Cup 2023: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్: పిచ్ రిపోర్ట్
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ని అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది
- Author : Praveen Aluthuru
Date : 10-10-2023 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup 2023: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ని అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు వారి రెండవ మ్యాచ్ అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతుంది. అఫ్గానిస్థాన్ తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఒకవైపు భారత్ తన గెలుపు జోరును కొనసాగించాలని కోరుకుంటోంది. మరోవైపు ఆతిథ్య దేశం భారత్పై అఫ్గానిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ పిచ్ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్మెన్కు స్వర్గధామంగా మారే అవకాశం ఉంది. చిన్న బౌండరీ కారణంగా బ్యాట్స్మెన్ సునాయాసంగా సిక్సులు, బోర్లు కొట్టగలడు. పిచ్ కూడా నెమ్మదిగా ఉంటుంది. దీని కారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ ప్రపంచకప్లో ఢిల్లీలో ఇది రెండో మ్యాచ్. అంతకుముందు శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యధిక స్కోరింగ్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక కలిసి మొత్తం 754 పరుగులు చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 428 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా శ్రీలంక కూడా 326 పరుగులు చేసింది. అటువంటి పరిస్థితిలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ కూడా అధిక స్కోరింగ్ చేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు.
Also Read: Triumph Scrambler 400 X: ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 విడుదల.. బుక్ చేసుకోండిలా..!