Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కోచ్గా ఎప్పటివరకు ఉండనున్నాడు..?
భారత క్రికెట్ జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ను బీసీసీఐ మరోసారి నియమించింది. ద్రవిడ్తో పాటు సిబ్బంది అందరి పదవీకాలాన్ని కూడా పొడిగించారు.
- By Gopichand Published Date - 10:12 AM, Thu - 30 November 23
Rahul Dravid: భారత క్రికెట్ జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ను బీసీసీఐ మరోసారి నియమించింది. ద్రవిడ్తో పాటు సిబ్బంది అందరి పదవీకాలాన్ని కూడా పొడిగించారు. ICC ప్రపంచ కప్ 2023 ముగియడంతో రాహుల్తో పాటు స్టార్ సభ్యులందరి పదవీకాలం కూడా ముగిసింది. ఇటువంటి పరిస్థితిలో భారత జట్టు ప్రధాన కోచ్ను మారుస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే BCCI మరోసారి రాహుల్ ద్రవిడ్ను నియమించింది. రాహుల్ ద్రవిడ్ ఎంతకాలం టీమ్ ఇండియా కోచ్గా ఉంటారనే ప్రశ్న మొదలైంది..?
ద్రవిడ్పై బీసీసీఐ విశ్వాసం
రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ను కోచ్గా నియమిస్తారంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరకు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా సాగింది. అయితే భారత కోచ్గా రాహుల్ ద్రవిడ్ను కొనసాగించాలని బీసీసీఐ మరోసారి అభ్యర్థించగా ద్రవిడ్ అంగీకరించాడు. గతంలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు T20 ప్రపంచకప్లో కోచ్ పదవిని ఆఫర్ చేసినప్పటికీ నెహ్రా కోచ్గా ఉండటానికి నిరాకరించాడు. ఇప్పుడు మరోసారి ద్రవిడ్ను కోచ్గా నియమించారు.
Also Read: Solar Storm: దూసుకువస్తున్న సౌర తుఫాను.. నేడు భూమిని తాకే అవకాశం, ఇంటర్నెట్ సేవలకు ఇబ్బంది..!?
ద్రవిడ్ ఎంతకాలం కోచ్గా ఉంటాడు?
వచ్చే ఏడాది జూన్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచకప్కు ఇంకా 7 నెలల సమయం ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే కోచ్గా ఉంటాడు. అంటే వచ్చే ఏడాది జూన్ తర్వాత మళ్లీ భారత జట్టుకు కొత్త ప్రధాన కోచ్ కోసం అన్వేషణ మొదలవుతుంది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ నెల వరకు మాత్రమే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జూన్ తర్వాత బీసీసీఐ మరోసారి రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక ప్రధాన కోచ్ని మారుస్తుందా అనేది చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.