Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. రూ. 24 లక్షలు ఫైన్!
ముంబై ఇండియన్స్ 147 రన్స్ (డీఎల్ఎస్ ప్రకారం సవరించిన లక్ష్యం) డిఫెండ్ చేస్తూ తమ ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేదు. ఈ తప్పిదం కారణంగా బీసీసీఐ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు దోషిగా నిర్ధారించింది.
- By Gopichand Published Date - 08:59 PM, Wed - 7 May 25

Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గుజరాత్ టైటాన్స్తో చివరి బంతి ఓటమి తర్వాత పెద్ద షాక్ తగిలింది. వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్ను ముంబై చివరి బంతిపై కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ (Hardik Pandya) జట్టుపై బీసీసీఐ జరిమానా విధించింది. హార్దిక్ మాత్రమే కాకుండా.. మొత్తం జట్టుపై కూడా జరిమానా విధించబడింది.
హార్దిక్ పాండ్యాపై 24 లక్షల రూపాయల జరిమానా
ముంబై ఇండియన్స్ 147 రన్స్ (డీఎల్ఎస్ ప్రకారం సవరించిన లక్ష్యం) డిఫెండ్ చేస్తూ తమ ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేదు. ఈ తప్పిదం కారణంగా బీసీసీఐ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు దోషిగా నిర్ధారించింది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై 24 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇది ముంబై ఈ సీజన్లో చేసిన రెండవ నేరం కావడం వల్ల ఈ చర్య తీసుకోబడింది.
Also Read: Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9
బీసీసీఐ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. పాండ్యా జట్టు ఈ సీజన్లో ఇది రెండవ తప్పు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాపై 24 లక్షల రూపాయల జరిమానా విధించారు. అలాగే ప్లేయింగ్-11లోని మిగిలిన ఆటగాళ్లపై, ఇంపాక్ట్ ప్లేయర్, కంకషన్ సబ్స్టిట్యూట్పై ఒక్కొక్కరిపై 6 లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.
గుజరాత్ చివరి బంతికి ముంబైని ఓడించింది
మంగళవారం రాత్రి ఐపీఎల్ 2025లో ఒక ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ను చివరి బంతికి ఓడించింది. వర్షం రెండుసార్లు మ్యాచ్కు అంతరాయం కలిగించింది. దీంతో గుజరాత్కు 147 రన్స్ సవరించిన లక్ష్యం లభించింది. మొదటిసారి వర్షం కారణంగా మ్యాచ్ ఆగినప్పుడు.. 155 రన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న గుజరాత్ జట్టు 14 ఓవర్లలో 2 వికెట్లకు 107 రన్స్ మాత్రమే చేసి డీఎల్ఎస్ ప్రకారం 8 రన్స్ ముందంజలో ఉంది.
తర్వాత 18వ ఓవర్లో వర్షం కారణంగా మ్యాచ్ మళ్లీ ఆగింది. ఈ సమయంలో గుజరాత్ 132 రన్స్ వద్ద 6 వికెట్లు కోల్పోయి డీఎల్ఎస్ ప్రకారం 5 రన్స్ వెనుకబడి ఉంది. అంటే ఒకవేళ మ్యాచ్ అప్పుడు ఆగిపోయి ఉంటే ముంబై 5 రన్స్ తేడాతో గెలిచేది. కానీ వర్షం ఆగడంతో గుజరాత్కు 19 ఓవర్లలో 147 రన్స్ సవరించిన లక్ష్యం లభించింది. అయితే గుజరాత్ చివరి ఓవర్లో ఆధిపత్యం చెలాయించి ఈ మ్యాచ్ను గెలుచుకుంది.