Hardik Pandya On Rohit Sharma: వాట్ ఈజ్ దిస్..? రోహిత్ శర్మకు ఇచ్చే గౌరవం ఇదేనా.. వీడియో వైరల్..!
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Hardik Pandya On Rohit Sharma) ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- By Gopichand Published Date - 10:37 AM, Mon - 25 March 24
Hardik Pandya On Rohit Sharma: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Hardik Pandya On Rohit Sharma) ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో హార్దిక్ ఫీల్డింగ్ కోసం ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను మైదానం అంతటా పరుగులు పెట్టించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మకు ఆదేశాలు ఇస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మతో హార్దిక్ ఆటలు ఆడుకున్నాడు. పదేపదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ను మారుస్తూ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. సాధారణంగా 30యార్డ్ సర్కిల్లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు.
Also Read: April 1st – Railway Tickets : ఏప్రిల్ 1 విడుదల.. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్స్
It's clearly visible that Hardik Pandya is unnecessarily changing Rohit's position💔
I beg you Hardik pls respect that Gem 🙏🏼.#chapri #HardikPandya #RohitSharma𓃵 #GTvsMI #GTvMI #GujaratTitans #CSKvsGT #RCBvsPBKS #HappyHoli #DhruvRathee pic.twitter.com/bCRZaOH0nS
— Dev Meena (@DevJaGjeeVanpuR) March 25, 2024
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 3 ఫోర్లు, 1 సిక్స్తో 45 (39 బంతుల్లో) అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ముంబై జట్టు 20 ఓవర్లలో 162/9 పరుగులు మాత్రమే చేయగలిగింది.
We’re now on WhatsApp : Click to Join
డిసెంబర్ 2023 నెలలో జరిగిన మినీ వేలంలో ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తిరిగి చేర్చుకుంది. హార్దిక్ పాండ్యా గతంలో కూడా ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఏర్పడిన తర్వాత అతను ఆ జట్టులో చేర్చబడ్డాడు. కెప్టెన్గా వ్యవహరించాడు. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ను ఒకసారి ఫైనల్ టైటిల్ను గెలుచుకునేలా చేశాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్కు చేరుకుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Tags
Related News
DC vs MI: ఐపీఎల్లో నేడు ఢిల్లీ వర్సెస్ ముంబై.. గెలిచెదెవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నంబర్-43లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.