Most Prize Money: క్రీడా ప్రపంచంలో ఏ టోర్నీకి ప్రైజ్ మనీ ఎక్కువ ఇస్తారో తెలుసా..?
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్లో విజేతగా నిలిచిన ప్రైజ్ మనీ (Most Prize Money) చూస్తే.. మిగతా ఈవెంట్ల కంటే ఇది ఎక్కువగానే ఉంటుంది.
- By Gopichand Published Date - 08:58 AM, Mon - 17 July 23
Most Prize Money: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్లో విజేతగా నిలిచిన ప్రైజ్ మనీ (Most Prize Money) చూస్తే.. మిగతా ఈవెంట్ల కంటే ఇది ఎక్కువగానే ఉంటుంది. వింబుల్డన్ 2023లో ఈసారి ప్రైజ్ మనీని కూడా 11 శాతం పెంచారు. మరోవైపు క్రికెట్లో ఐపీఎల్, వరల్డ్కప్ విజేతలకు అందుతున్న సొమ్ముతో పోలిస్తే.. అందులోనూ చాలా ముందుంది వింబుల్డన్ ప్రైజ్ మనీ.
వింబుల్డన్ 2023లో 20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జకోవిచ్ను ఓడించి టైటిల్ను గెలుచుకున్నాడు. విజయం తర్వాత అల్కరాజ్ దాదాపు 25 కోట్లు ప్రైజ్ మనీగా అందుకున్నాడు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన నొవాక్ జకోవిచ్కు కూడా రూ.12.25 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టైటిల్ గెలుచుకున్నప్పుడు ఆ జట్టు మొత్తం రూ. 20 కోట్లు గెలుచుకున్నారు. ఇది మొత్తం జట్టుకు పంపిణీ చేయబడింది. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్కు రూ.13 కోట్లు అందించారు. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్కు రూ.13.05 కోట్లు ప్రైజ్ మనీగా లభించగా, రన్నరప్గా నిలిచిన పాకిస్థాన్కు రూ.6.5 కోట్లు లభించాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్, US ఓపెన్ లలో కూడా పెద్ద ప్రైజ్ మనీ
వింబుల్డన్ కాకుండా మరో 3 పెద్ద గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లు సంవత్సరంలో నిర్వహించబడతాయి. వీటిలో లభించే ప్రైజ్ మనీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతేడాది యూఎస్ ఓపెన్లో సింగిల్ ఈవెంట్లో విజేతగా నిలిచిన ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు అందించారు. ఇది కాకుండా, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో సింగిల్ ఈవెంట్ విజేతకు రూ. 16.73 కోట్లకు పైగా ప్రైజ్ మనీ ఇవ్వగా, ఫ్రెంచ్ ఓపెన్ 2023 సింగిల్ ఈవెంట్లో విజేతకు రూ. 20.58 కోట్లకు పైగా ప్రైజ్ మనీ లభించింది.
Related News
GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్గా మారింది. ఈ సీజన్లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో 200 స్కోర్లు చేస్తున్నారు.