Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!
వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్కు వికెట్ ఇచ్చాడు. అయితే ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 133 పరుగుల ఆధిక్యం సాధించింది.
- Author : Gopichand
Date : 01-02-2025 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi vs Railways: రంజీ క్రికెట్లో రైల్వేస్పై (Delhi vs Railways) ఆయుష్ బడోని నేతృత్వంలోని ఢిల్లీ జట్టు మూడో రోజునే విజయం సాధించింది. రెండో రోజు మ్యాచ్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రైల్వేస్ మొదట చేసి 241 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ జట్టు కెప్టెన్ బడోని 99 పరుగులు, సుమిత్ మాథుర్ 86 పరుగులతో జట్టు 374 పరుగులు చేసింది.
వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్కు వికెట్ ఇచ్చాడు. అయితే ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 133 పరుగుల ఆధిక్యం సాధించింది. రైల్వేస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో కేవలం 114 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్లో ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ తరఫున శివమ్ శర్మ రెండో ఇన్నింగ్స్లో అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.
Also Read: PAN Card: పాన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే రూ. 10 వేల జరిమానా
సుమిత్ మాథుర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు
సుమిత్ మాథుర్ తన ఆల్ రౌండ్ ప్రదర్శన తర్వాత న్యూ ఢిల్లీలోని కిక్కిరిసిన అరుణ్ జైట్లీ స్టేడియం ముందు రైల్వేస్ జట్టుని ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 27 ఏళ్ల మాథుర్ రెండో ఇన్నింగ్స్లో ఎలాంటి వికెట్ తీయలేకపోయాడు. కానీ మొదటి ఇన్నింగ్స్లో అతను మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్తో 86 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు.
రైల్వేస్ రెండో ఇన్నింగ్స్ 114 పరుగుల వద్ద ముగిసింది
రైల్వేస్ రెండో ఇన్నింగ్స్ 30.5 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ శివమ్ శర్మ 11 ఓవర్లలో నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను రైల్వేస్లో సూరజ్ అహుజా, వివేక్ సింగ్, మహ్మద్ సైఫ్, కర్ణ్ శర్మ, రాహుల్ శర్మల వికెట్లు తీశాడు. ఢిల్లీ బౌలర్లలో శివమ్తో పాటు నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మణి గ్రేవాల్, కెప్టెన్ బదోనీలకు ఒక్కో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో విజయం నమోదు చేయడం ద్వారా ఢిల్లీ ప్రస్తుతం 21 పాయింట్లతో గ్రూప్లో మూడో స్థానంలో నిలిచింది. జట్టు ఏడు మ్యాచ్లు ఆడింది. అందులో రెండు గెలిచింది. రెండు ఓడిపోయింది. మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి.