గేల్ , జాంటీ రోడ్స్లకు మోదీ స్పెషల్ మెసేజ్
ప్రపంచ క్రికెట్లో పలువురు స్టార్ ప్లేయర్స్కు భారత్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
- By Hashtag U Published Date - 10:45 AM, Thu - 27 January 22
ప్రపంచ క్రికెట్లో పలువురు స్టార్ ప్లేయర్స్కు భారత్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దేశంతో సంబంధం లేకుండా వారిని మన ఫ్యాన్స్ బాగానే అభిమానిస్తారు. అలాంటి వారిలో సౌతాఫ్రికా ఫీల్డింగ్ సెన్సేషన్ జాంటీ రోడ్స్ , విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ ఖచ్చితంగా ఉంటారు. తమ ఆటతో ఇక్కడి అభిమానులను ఆకట్టుకున్న వారికి కాస్త గట్టి రిలేషనే ఉంది. తాజాగా 73వ గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం పంపించారు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రధాని పంపిన లేఖను రోడ్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భారత దేశ ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న కొంతమంది స్నేహితులకు నేను ఈ లేఖ రాస్తున్నాను. భవిష్యత్తులోనూ మీరు భారత్తో సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. మీ కుమార్తెకు ఇండియా జెన్సీ రోడ్స్ అని పేరు పెట్టుకున్నారంటే మీకు భారత్పై ఉన్న అభిమానం అర్థమవుతోందంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాంటీ రోడ్స్ కూడా మోదీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు.భారత దేశ ప్రజల అభిమానం తననెంతో ఆకట్టుకుందంటూ ప్రశంసించాడు.
I would like to congratulate India on their 73rd Republic Day. I woke up to a personal message from Prime Minister Modi @narendramodi reaffirming my close personal ties with him and to the people of India. Congratulations from the Universe Boss and nuff love 🇮🇳🇯🇲❤️🙏🏿
— Chris Gayle (@henrygayle) January 26, 2022
అటు గేల్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో మెసేజ్ చేశాడు. భారతప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్ మెసేజ్తో ఈరోజు ఉదయాన్నే మేల్కొన్నాను… 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులందరికి ఇవే నా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీతో పాటు భారత దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీ అందరికి యునివర్సల్ బాస్ శుభాకాంక్షలు చెబుతున్నాడు అంటూ ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , పంజాబ్ కింగ్స్ తరఫున క్రిస్ గేల్ బరిలోకి దిగాడు. అయితే త్వరలో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలానికి గేల్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో గేల్ తన పేరును నమోదు చేసుకోలేదు.
Thank you @narendramodi ji for the very kind words. I have indeed grown so much as an individual on every visit to India. My whole family celebrates #RepublicDay with all of India, honouring the importance of a #Constitution that protects the rights of the Indian people #JaiHind pic.twitter.com/olovZ8Pgvn
— Jonty Rhodes (@JontyRhodes8) January 26, 2022
Related News
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.