IPL 2025: ఐపీఎల్ 2025 కోసం అంపైర్లను ప్రకటించిన బీసీసీఐ!
ఐపీఎల్ కొత్త సీజన్ కోసం అంపైర్ ప్యానెల్ను ప్రకటించారు. ఈసారి ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లకు అవకాశం ఇచ్చారు.
- By Gopichand Published Date - 12:01 PM, Fri - 21 March 25

IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్ కోసం అంపైర్ ప్యానెల్ను ప్రకటించారు. ఈసారి ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లకు అవకాశం ఇచ్చారు. ఈ అంపైర్లలో స్వరూపానంద్ కన్నూర్, అభిజిత్ భట్టాచార్య, పరాశర్ జోషి, అనిష్ సహస్రబుద్ధే, కేయూర్ కేల్కర్, కౌశిక్ గాంధీ, అభిజిత్ బెంగ్రీ ఉన్నారు. వీరితో పాటు అనుభవజ్ఞులైన అంపైర్లు ఎస్. రవి, CK నందన్ IPL 2025లో అంపైర్ల మెంటార్లుగా నియమించబడ్డారు. IPL 2025 మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR వర్సెస్ RCB మధ్య జరుగుతుంది.
కొత్త అంపైర్లకు అనుభవాన్ని అందించడానికి ప్రణాళిక
ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్, ఒత్తిడితో కూడిన మ్యాచ్లలో కొత్త అంపైర్లకు ఇవ్వడం వల్ల వారికి విలువైన అనుభవం లభిస్తుందని బీసీసీఐ విశ్వసిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. తమిళనాడు మాజీ క్రికెటర్ కౌశిక్ గాంధీ ఈ ప్యానెల్లో చేర్చబడ్డారు. అతను 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇది అంపైర్గా అతని రెండవ సీజన్ అవుతుంది. అయితే అతను ఇప్పటికే మహిళల అంతర్జాతీయ మ్యాచ్లు, మహిళల ప్రీమియర్ లీగ్లలో అంపైరింగ్ చేస్తున్నారు. అతని ప్రదర్శన ఆకట్టుకుంటుంది.
Also Read: KKR vs RCB: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. గణంకాలు ఏం చెబుతున్నాయి?
కామెంటేటర్గా అనిల్ చౌదరి
ఈసారి అంతర్జాతీయ అంపైర్లలో శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన ఐపీఎల్ మ్యాచ్లలో అంపైరింగ్ చేయడం కనిపించదు. దీనితో పాటు ఐపీఎల్ 2024లో అంపైరింగ్ చేయనున్న అనిల్ చౌదరి కూడా ఈసారి కనిపించడు. అనిల్ చౌదరి టీవీ వ్యాఖ్యానం వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఆయన కామెంటరీ బాక్స్లో కనిపిస్తారు. ఈసారి తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్లో అంపైరింగ్ చేయనున్నాడు. ఇటీవల యుపీసీఏ (ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్) ఐపీఎల్ 2025లో తన్మయ్కు అంపైరింగ్ బాధ్యతను అప్పగించినట్లు ప్రకటించింది.
Also Read: KKR vs RCB: ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మొదటి మ్యాచ్ రద్దు?