Andhra Premier League 2023: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ షెడ్యూల్
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న ఆదరణ వేరు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కోట్లు ఆర్జిస్తున్నది.దీంతో బీసీసీఐ అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా నిలిచింది.
- By Praveen Aluthuru Published Date - 03:14 PM, Sat - 12 August 23
Andhra Premier League 2023: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న ఆదరణ వేరు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కోట్లు ఆర్జిస్తున్నది.దీంతో బీసీసీఐ అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా నిలిచింది. నిజానికి ప్రీమియర్ లీగ్ లో ఫ్రాంచైజీలు పలు రాష్ట్రాలకు ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు, కోల్కతా, ఢిల్లీ, గుజరాత్, లక్నో, ముంబై హైదరాబాద్, రాజస్థాన్. అయితే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఓ జట్టు కావాలన్న సంకల్పతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ని తీసుకొచ్చింది. తాజాగా ఈ లీగ్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 27న ఫైనల్తో ముగుస్తుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం 11 రోజుల టీ20 టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. గత సంవత్సరం ఆరు జట్లు తలపడగా.. ఈ ఏడాది కూడా ఆ జట్లే బరిలో దిగుతున్నాయి.
ఈ టోర్నీలో ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్.. మొత్తం ఆరు టీమ్స్ తలపడతాయి. ఈ ఆరు జట్లు ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో తలపడతాయి. ఆగస్టు 25న ఎలిమినేటర్ , అదేరోజు క్వాలిఫైయర్ 1 , ఆగస్టు-26 క్వాలిఫైయర్-2, ఆగస్టు 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఏపీఎల్ పూర్తి షెడ్యూల్ ఒకసారి చూస్తే..
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 16న కోస్టల్ రైడర్స్ బెజవాడ టైగర్స్ మధ్య జరగనుంది.
ఆగస్టు 17న వైజాగ్ వారియర్స్ గోదావరి టైటాన్స్ తలపడతాయి.
అదేరోజు రాయలసీమ కింగ్స్ ఉత్తరాంధ్ర లయన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఆగస్టు 18, కోస్టల్ రైడర్స్-వైజాగ్ వారియర్స్
ఆగస్టు 18 బెజవాడ టైగర్స్- గోదావరి టైటాన్స్
ఆగస్టు 19 బెజవాడ టైగర్స్-రాయలసీమ కింగ్స్
ఆగస్టు 19 ఉత్తరాంధ్ర లయన్స్-కోస్టల్ రైడర్స్
ఆగస్టు 20 ఉత్తరాంధ్ర లయన్స్-వైజాగ్ వారియర్స్
ఆగస్టు 20 గోదావరి టైటాన్స్ – రాయలసీమ కింగ్స్
ఆగస్టు 21 బెజవాడ టైగర్స్ -ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 21, 5 PM, రాయలసీమ కింగ్స్ -వైజాగ్ వారియర్స్
ఆగస్టు 22 గోదావరి టైటాన్స్ -కోస్టల్ రైడర్స్
ఆగస్టు 22 వైజాగ్ వారియర్స్-బెజవాడ టైగర్స్
ఆగస్టు 23 కోస్టల్ రైడర్స్ జట్టు రాయలసీమ కింగ్స్ తో తలపడనుంది.
ఆగస్టు 23 ఉత్తరాంధ్ర లయన్స్ గోదావరి టైటాన్స్ తో మ్యాచ్ జరగనుంది.
కాగా.. ఆగస్టు 25 ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
ఆగస్టు 25 క్వాలిఫైయర్ 1
ఆగస్టు 26 క్వాలిఫైయర్ 2
ఆగస్టు 27 ఫైనల్ పోరు జరుగుతుంది.
Also Read: Jailer : ‘జైలర్’ చిత్రాన్ని వీక్షించిన సీఎం స్టాలిన్
Related News
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.