Two Special Trains: భక్తులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీ- వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్లు..!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, అదనపు రద్దీ భారాన్ని తగ్గించేందుకు ఉత్తర రైల్వే న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్ల (Two Special Trains)ను నడపాలని నిర్ణయించింది.
- By Gopichand Published Date - 06:54 AM, Wed - 20 September 23
Two Special Trains: మీరు పండుగ సీజన్లో మాతా వైష్ణో దేవిని దర్శించుకోవాలనుకునేవారికి ఉత్తర రైల్వే ఒక శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, అదనపు రద్దీ భారాన్ని తగ్గించేందుకు ఉత్తర రైల్వే న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్ల (Two Special Trains)ను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కేటగిరీ కోచ్లతో కూడిన ప్రత్యేక రైళ్లు.
04071 న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా ప్రత్యేక రైలు తేదీ 29.09.2023. ఇది న్యూఢిల్లీ నుండి రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:25 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా చేరుకుంటుంది. తిరుగు దిశలో 04072 శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా – న్యూఢిల్లీ ప్రత్యేక రైలు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుండి 01.10.2023 సాయంత్రం 06.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.
AC క్లాస్ కోచ్లతో కూడిన ఈ ప్రత్యేక రైలు సోనిపట్, పానిపట్, కర్నాల్, కురుక్షేత్ర జంక్షన్, అంబాలా కాంట్, లూథియానా, జలంధర్ కాంట్, పఠాన్కోట్ కాంట్, జమ్ము తావి, ఉధంపూర్ (అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్) స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది.
Also Read: Canada vs India: ఢిల్లీలో కెనడా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. భద్రత పెంపు
రైలు నంబర్ 04081 న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా ప్రత్యేక రైలు తేదీ 30.09.2023. ఇది న్యూఢిల్లీ నుండి రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:25 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా చేరుకుంటుంది. తిరుగు దిశలో 04082 శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా – న్యూఢిల్లీ ప్రత్యేక రైలు తేదీ 02.10.2023. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుండి సాయంత్రం 06.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.25 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.
ఈ రైళ్లు సోనిపట్, పానిపట్, కర్నాల్, కురుక్షేత్ర జంక్షన్, అంబాలా కాంట్, లూథియానా, జలంధర్ కాంట్, పఠాన్కోట్ కాంట్, జమ్ము తావి, ఉధంపూర్ (అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్) స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.