Telangana: ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజనింగ్తో 15 మంది అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు .ముండెం బలిరాం ఇంట్లో పితృమాస సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనంలో
- By Praveen Aluthuru Published Date - 02:55 PM, Sat - 7 October 23

Telangana: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు .ముండెం బలిరాం ఇంట్లో పితృమాస సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనంలో 15 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వారిని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు .అస్వస్థతకు గురైన వారిలో కొందరిని జిల్లా కేంద్రంలోని రిమ్స్కు , మరికొందరిని అంబులెన్స్లలో మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించి , మిగిలిన వారి కోసం గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు సేవలందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Telangana BJP: బీజేపీలో చీకోటి ప్రవీణ్కు లైన్ క్లియర్