Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
- Author : Gopichand
Date : 02-11-2025 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
Road Accident: రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఒక టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో పోలీసు బృందం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం మతోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
టూరిస్ట్ బస్సులోని ప్రయాణీకులు జోధ్పూర్లోని సూర్ సాగర్ ప్రాంతం నుండి బికనేర్ జిల్లాలోని కొలాయత్ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నట్లు సమాచారం. బస్సు కొలాయత్ నుండి జోధ్పూర్ వైపు వస్తోంది. మతోడా సమీపంలో రహదారి పక్కన ఒక ట్రక్కు నిలిచి ఉంది. అతి వేగంగా వస్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ ఆ ట్రక్కును గమనించకపోవడంతో ఘోరంగా ఢీకొట్టింది.
Also Read: Headache: మైగ్రేన్, తలనొప్పి సమస్య వేధిస్తుందా? అయితే ఈ పొరపాట్లు చేయకండి!
18 మంది మృతి, పలువురికి గాయాలు
ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో చాలా మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించినట్లు, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు మతోడా స్టేషన్ అధికారి అమానారామ్ ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం జోధ్పూర్కు తరలించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది జోధ్పూర్ జిల్లాలోని సూర్ సాగర్ ప్రాంతానికి చెందిన వారేనని సమాచారం.
పరిస్థితి- సహాయక చర్యలు
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపించారు. ప్రమాదం తరువాత ట్రక్కు డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రమాదం తర్వాత బస్సులో చిక్కుకున్న ప్రయాణీకులను బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.