Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత ఎట్టకేలకు సోమవారం ముఖ్యమంత్రి పదవి (Madhya Pradesh CM)పై ఉత్కంఠకు తెరపడింది.
- By Gopichand Published Date - 05:12 PM, Mon - 11 December 23
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత ఎట్టకేలకు సోమవారం ముఖ్యమంత్రి పదవి (Madhya Pradesh CM)పై ఉత్కంఠకు తెరపడింది. శాసనసభా పక్ష సమావేశం అనంతరం మోహన్ యాదవ్కు ఈ బాధ్యతలు అప్పగించారు. మోహన్ యాదవ్ 2013లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై శివరాజ్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనతో పాటు రాజేష్ శుక్లా, జగదీష్ దేవరా ఉప ముఖ్యమంత్రులుగా, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
అంతకుముందు నియమించబడిన ముగ్గురు పరిశీలకులు మనోహర్ లాల్ ఖట్టర్, కె లక్ష్మణ్, ఆశా లక్రా పార్టీ కార్యాలయంలోని ఒక గదిలో రాష్ట్ర సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఇందులో పదవీకాలం ముగిసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మతో పాటు ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా భావిస్తున్న ఆరుగురు వ్యక్తులు హాజరయ్యారు.
Also Read: Prakash Raj: కేసీఆర్ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్
డిసెంబర్ 3న ప్రకటించిన ఫలితాల్లో బీజేపీకి 163 సీట్లు
డిసెంబర్ 3న దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇందులో మధ్యప్రదేశ్లోని 230 స్థానాలకు గాను 163 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే దీని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. 19 ఏళ్లలో తొలిసారిగా శాసనసభా పక్ష నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలకులను నియమించాల్సిన పరిస్థితి బీజేపీ నాయకత్వానికి ఎదురైంది.
సోమవారం సాయంత్రం 4 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరును ఆమోదించారు. మరోవైపు దీనికి కొద్దిసేపటి ముందు ముగ్గురు పరిశీలకులు మనోహర్లాల్ ఖట్టర్, కె. లక్ష్మణ్, ఆశ లక్రా రాష్ట్ర సీనియర్ నేతలతో విడివిడిగా చర్చించారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. శాసనసభా పక్ష సమావేశం ప్రారంభానికి ముందు ప్రహ్లాద్ పటేల్ మద్దతుదారులు పార్టీ కార్యాలయం వెలుపల జిందాబాద్ నినాదాలు చేశారు. ఈ మద్దతుదారులు ప్రహ్లాద్ సింగ్ పటేల్ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Siddaramaiah: ప్రజ్వల్ రేవణ్ణ ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేస్తా
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఏ దేశంలో ఉన్నా సరే అరెస్ట్ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పారు.