Crime: హైదరాబాద్ లంగర్హౌజ్లో దారుణం..వ్యక్తిని నరికి చంపిన దుండగులు
లంగర్హౌజ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది.
- By Hashtag U Published Date - 12:00 PM, Thu - 12 May 22
హైదరాబాద్: లంగర్హౌజ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ జహంగీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఈ ఘటన PVNR ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 95 వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్ బార్ ఎదురుగా నిలబడి ఉండగా.. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా అతనిపైకి వచ్చి పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనలో జహంగీర్ శరీరంపై అనేక గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న లంగర్హౌజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దింపి నిందుతుల ఆచూకి కోసం గాలిస్తున్నారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి, దుండగులకు మధ్య పాత శత్రుత్వం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Related News
Rahil – Another Case : ఆ కేసులోనూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే నిందితుడు !
Rahil - Another Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.